Wednesday, May 15, 2024

అజ్ఞాతంలోకి బాబా ఫసీయుద్దీన్

తప్పక చదవండి
  • హైదరాబాద్ మాజీ డిప్యూటీ మేయర్‌పై కేసు నమోదు
  • చంపేస్తానని బెదిరింపులకు పాల్పడ్డాడంటూ వ్యక్తి ఫిర్యాదు

హైదరాబాద్ మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసీయుద్దీన్, కొడంగల్‌ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి సహా మరో ఏడుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. బాబా ఫసీయుద్దీన్ దాడి చేసి చంపేస్తానని బెదిరించాడంటూ నారాయణపేట జిల్లా కోస్గికి చెందిన బాధితుడు నరేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ పార్టీకి మద్దతు ఇస్తే చంపేస్తామని బెదిరించారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో నరేష్‌ పేర్కొన్నాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు బాబా ఫసీయద్దీన్, పట్నం మహేందర్ రెడ్డి సహా.. మరో ఏడుగురిపై 307, 147, 148, 341, 392, 171-F, 504, 506 R/W, 149 ఐపీసీ సెక్షల కింద కేసు నమోదు చేశారు. అయితే బాబా ఫసీయుద్దీన్ గత రెండ్రోజులుగా పరారీలో ఉన్నట్లు తెలిసింది. ఆయన ఆచూకీ కోసం కోస్గి పోలీసులు బోరబండ పోలీసుల సాయంతో వెతుకులాట ప్రారంభించినట్లు సమాచారం. ఆయన్ను అదుపులోకి తీసుకొని మరిన్ని వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు