Tuesday, May 7, 2024
Array

బీ.ఎస్.పీ. నాయకులకు విజ్ఞప్తి..

తప్పక చదవండి
  • చోళ్ళేటి మహేష్ బాబు, అడ్వకేట్, బీ.ఎస్.పీ. రాష్ట్ర కమిటీ సభ్యులు,
    బీ.ఎస్.పీ. కార్మిక విభాగం స్టేట్ ఇంచార్జి
    .

హైదరాబాద్ : బీ.ఎస్.పీ. జాతీయ అధ్యక్షురాలు మాయావతి, ఎంపీ రాంజీ గౌతమ్, తెలంగాణా రాష్ట్ర శాఖ అధ్యక్షులు ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్, ఎన్నికల సెలక్షన్ కమిటీ సభ్యులకు విజ్ఞప్తి.. గత సంవత్సరం జరిగిన మునుగోడు ఉప ఎన్నికలలో “తెలంగాణ లేబర్ పార్టీ “(రాష్ట్ర ఉపాధ్యక్షులు గా ) నుండి నామినేషన్ వేసి ఒక బీసీ బిడ్డ కు (అందోజు శంకరా చారికి ) మద్దత్తు గా నామినేషన్ ఉపసంహారించుకొని, మరీ అందోల్ మైసమ్మ గుడి దగ్గర, ఆర్.ఎస్.పీ. నాయకత్వంలో పనిచేయడానికి, బీ.ఎస్.పీ. లో జాయిన్ అయ్యాను.. అనంతరం పార్టీ నుండి ఎలాంటి ఆర్ధిక సహాయ, సహకారం లేకపోయినా, పార్టీలో పెద్ద పదవులు ఇవ్వకున్నా, ఇచ్చిన భాద్యతలను నా శక్తి కి మించి చేశాను. పార్టీ కి, పార్టీ అధ్యక్షుల వారికీ విశ్వసనీయుడిగా, వారి ఆదేశాలను తప్పకుండా శిరసావహించాను.. కావున నేను పార్టీకి చేసిన సేవలను గుర్తించి ఇబ్రహీంపట్నం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి, అన్ని రకాలుగా సంసిద్ధుడుగా ఉన్నాను. కావున తమరు నా యందు దయవుంచి ఇబ్రహీంపట్నం అసెంబ్లీ నుండి అవకాశం ఇప్పిస్తే, గెలవడానికి నా శాయశక్తుల కృషి చేస్తానని మీకు విన్నవించుకుంటూ, ఒక బీసీ (విశ్వకర్మ, కంసాలి) బిడ్డ నైన నాకు అవకాశం ఇస్తారని ఆశిస్తున్నాను..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు