Wednesday, May 8, 2024

ఎంబీఏలో అడ్మిషన్లు..

తప్పక చదవండి
  • విద్యార్థులకు జేఎన్‌టీయూలో అవకాశం
    ఎంటెక్‌, ఎంఫార్మసీ, ఎంఎస్సీ, ఎంసీఏ కోర్సులు చదువుతున్న విద్యార్థులకు జేఎన్టీయూ మరో అవకాశం కల్పించింది. ఈ విద్యాసంవత్సరం నుంచి ఈ కోర్సులు చదువుతున్న వారు సెకండ్‌ డిగ్రీ కోర్సుగా ఎంబీఏను ఎంపిక చేసుకొనే సౌకర్యం కల్పిస్తూ నిర్ణయం తీసుకొన్నది. ఈ మేరకు మంగళవారం వర్సిటీ రిజిస్ట్రార్‌ ఎంబీఏ ప్రవేశాల నోటిఫికేషన్‌ను విడుదల చేశారు.
    ఎంబీఏలో డాటా సైన్స్‌, ఫైనాన్షియల్‌ అకౌంటింగ్‌ అండ్‌ అనాలిసిస్‌, మార్కెటింగ్‌ మేనేజ్‌మెంట్‌, బిజినెస్‌ ఎకనామిక్స్‌, లీగల్‌ అండ్‌ బిజినెస్‌ ఎన్విరాన్‌మెంట్‌, హ్యుమన్‌ రిసోర్సెస్‌ మేనేజ్‌మెంట్‌, మేనేజ్‌మెంట్‌ ఇన్‌ఫర్మేషన్‌ సిస్టమ్స్‌ వంటి ప్రత్యేక సబ్జెక్టులలో అడ్మిషన్‌ పొందే అవకాశం కల్పించనున్నారు. మూడేండ్ల కాల పరిమితి ఉన్న ఈ కోర్సులో ప్రవేశాలకు సెప్టెంబర్‌ 30 వరకు అవకాశం కల్పించారు. ఫీజు చెల్లించడానికి అక్టోబర్‌ 30 తుది గడువుగా విధించారు. వివరాలకు ఎంబీఏ కాలేజీ ప్రిన్సిపాల్‌ లేదా 9154251963 సంప్రదించాలని వర్సిటీ అధికారులు సూచించారు.
-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు