- రూ.12,400 కోట్ల పెట్టుబడిని ప్రకటించిన సంస్థ
- దావోస్ వేదికగా సిఎం సమక్షంలో ఎంవోయూలు
హైదరాబాద్ : అదానీ గ్రూప్ తెలంగాణలో భారీ పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమైంది. రాష్ట్రంలో పలు వ్యాపారాల ద్వారా రూ.12,400 కోట్ల పెట్టుబడిని ప్రకటించినట్లు తెలంగాణ ప్రభుత్వం తాజాగా వెల్లడిరచింది. ఈ మేరకు స్విట్జర్లాండ్లోని దావోస్లో జరగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సులో తెలంగాణ సీఎం రేవంత్రెడ్డితో అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ భేటీ అయ్యారు. రాష్ట్రంలో పెట్టుబడు లపై ఇరువురూ చర్చించి నాలుగు ఎంవోయూలు కుదుర్చుకున్నారు. అధికారిక ప్రకటన ప్రకారం, హైదరాబాద్లో అదానీ గ్రీన్ ఎనర్జీ 1350 మెగావాట్ల రెండు పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్ట్లను ఏర్పాటు చేయడానికి రూ. 5వేల కోట్ల పెట్టుబడి పెట్టనుంది. చందనవెల్లిలో డేటా సెంటర్ క్యాంపస్ను ఏర్పాటు చేసేందుకు అదానీకాన్ఎక్స్ డేటా సెంటర్ రూ. 5వేలకోట్లు పెట్టుబడి పెట్టనుంది. అంబుజా సిమెంట్స్ లిమిటెడ్ తెలంగాణలో ఏడాదికి 6 మిలియన్ టన్నుల సామర్థ్యంతో సిమెంట్ గైర్రడిరగ్ యూనిట్లో రూ.14వందల కోట్ల పెట్టుబడి పెట్టనుంది. తెలంగాణలోని హైదరాబాద్లోని అదానీ ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ పార్క్లోని కౌంటర్ డ్రోన్ సిస్టమ్స్, క్షిపణి అభివృద్ధి, తయారీ కేంద్రాలలో అదానీ గ్రూప్ ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ రూ.1,000 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టులకు అవసరమైన సౌకర్యాలు, మౌలిక సదుపాయాలు, సహాయాన్ని అందజేస్తుందని గౌతమ్ అదానీకి ముఖ్యమంత్రి హావిూ ఇచ్చారు. రాష్ట్రంలో ఏరో స్పేస్ పార్కుతో పాటు డేటా సెంటర్ ప్రాజెక్టు నెలకొల్పేందుకు అదానీ గ్రూప్ సీఎం రేవంత్తో చర్చలు జరిపింది. వీటికి సంబంధించిన పురోగతితో పాటు కొత్త ప్రాజెక్టుల స్థాపనపై సమావేశంలో చర్చించారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో సీఎం రేవంత్తో అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ సమావేశమయ్యారు. తెలంగాణలో పెట్టుబడులపై చర్చించారు. రాష్ట్రంలో 12వేల 400 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు ప్రకటించినట్లు సమాచారం. సిఎం వెంట మంత్రి శ్రీధర్ బాబుతో పాటు, ఉన్నతస్థాయి అధికారుల బృందం కూడా ఉంది.