Saturday, April 20, 2024

అన్నమయ్య జిల్లాలో రోడ్డు ప్రమాదం..

తప్పక చదవండి

అన్నమయ్య జిల్లాలో భక్తులు ప్రయాణిస్తున్న బస్సు బోల్తా పడింది. 63 మంది భక్తులు గాయపడ్డారు. వివరాలు.. బెంగళూరు నుంచి తిరుపతికి ప్రయాణికులతో వస్తున్న ప్రైవేట్‌ బస్సు అన్నమయ్య జిల్లాలో కారును ఢీ కొట్టి బోల్తా పడింది.ఈ ఘటనలో బస్సులోని 63 మంది ప్రయాణికులకు స్పల్ప గాయాలు అయ్యాయి. వీరిని స్థానికులు హుటాహుటినా మదనపల్లె ఆస్పత్రికి తరలించారు.

తీవ్రంగా గాయపడ్డ మరో ఏడుగురిని తిరుపతిలోని ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు, 108 సిబ్బంది ఘటనా స్థలానికి వెళ్లి సహాయక చర్యలు చేపట్టారు.బస్సు డ్రైవర్‌ అతివేగం, నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులు వెల్లడించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు