Friday, April 26, 2024

ఐక్యత అవసరమే

తప్పక చదవండి
  • ఏపీ, తెలంగాణ, బెంగాల్‌, ఢల్లీిలలో బలంగా ఉన్న ప్రాంతీయ పార్టీలకు అండగా ఉండాలన్న మమత
  • కాంగ్రెస్‌ బలంగా ఉన్నచోట తాము అండగా ఉంటామని హామీ
  • బీజేపీకి వ్యతిరేకంగా కర్ణాటక ప్రజలు ఓటేశారని వ్యాఖ్య

కోల్‌కతా (ఆదాబ్ హైదరాబాద్) : విపక్షాల ఐక్యతపై పశ్చిమ బెంగాల్‌ సీఎం, తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి మమతా బెనర్జీ సానుకూలంగా స్పందించారు. ప్రతిపక్షాల ఐక్యతపై సోమవారం స్పష్టత ఇచ్చారు. వచ్చే ఏడాది జరుగనున్న పార్లమెంట్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి మద్దతిస్తామని తెలిపారు. కలసికట్టుగా బిజెపిని ఓడిరఏందుకు తాము సిద్దమని అన్నారు. అయితే ఆ పార్టీ కూడా మిగతా ప్రతిపక్ష పార్టీలకు మద్దతు ఇవ్వాలని కండీషన్‌ పెట్టారు. ప్రతిపక్షాల ఐక్యతపై ఈ మేరకు తొలిసారి నోరు విప్పారు. ఆ రాష్ట్ర సచివాలయంలో మీడియాతో ఆమె మాట్లాడారు. ‘కాంగ్రెస్‌ బలంగా ఉన్న చోట, వారిని పోరాడనివ్వండి. మేం వారికి (కాంగ్రెస్‌కు) మద్దతు ఇస్తాం. అందులో తప్పు లేదు. అయితే ఇతర రాజకీయ పార్టీలకు కూడా వారు (కాంగ్రెస్‌) మద్దతు ఇవ్వాలి’ అని ఆమె అన్నారు. కాంగ్రెస్‌కు మద్దతు కావాలంటే ఆ పార్టీ కూడా ఇతర పార్టీలకు మద్దతు ఇవ్వాలని స్పష్టం చేశారు. కాగా, లోక్‌సభ ఎన్నికల్లో సీట్ల పంపకం గురించి కూడా మమతా బెనర్జీ మాట్లాడారు. ప్రాంతీయ పార్టీల హవా ఉన్న చోట వాటికే సీట్లు కేటాయించాలని అన్నారు. బలమైన ప్రాంతీయ పార్టీలకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. బీజేపీని అధికారం నుంచి దించిన కర్ణాటక ప్రజలకు తొలుత ఆమె అభివాదం చేశారు. అయితే అక్కడ గెలిచిన కాంగ్రెస్‌ పార్టీ గురించి ఈ సందర్భంగా ఎలాంటి ప్రస్తావన చేయలేదు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు