Saturday, July 27, 2024

యువజన కాంగ్రెస్‌ కార్యకర్తలు సైనికులుగా పనిచేయాలి

తప్పక చదవండి
  • బీజేపీ, బీఆర్‌ఎస్‌ పార్టీలు యువతకు చేసిన మోసాలను ప్రజలకు వివరించాలి
    మాజీ ఎమ్మెల్యే బాలునాయక్‌
    దేవరకొండ మండలం : దేవరకొండ పట్టణం పరిధిలో కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో రాబోయే ఎన్నికల్లో యువజన కాంగ్రెస్‌ నేతలు సైనికులుగా పనిచేసి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీని అధికారంలోకి తేవాలని దేవరకొండ మాజీ ఎమ్మెల్యే బాలునాయక్‌.యూవజన కాంగ్రెస్‌ జాతీయ కార్యదర్శి ఖాలీద్‌ అహ్మద్‌ లు అన్నారు.శుక్రవారం దేవరకొండ పట్టణంలో జరిగిన యూవజన కాంగ్రెస్‌ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం నియోజకవర్గ అధ్యక్షులు కిన్నెర హరికృష్ణ అధ్యక్షతన నిర్వహించారు.ఈసందర్భంగా వారు మాట్లాడుతూ రేపటి నుంచి యువజన కాంగ్రెస్‌ శ్రేణులు ప్రతి ఇంటికి వెళ్లి కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే చేసే అభివృద్ధి కార్యక్రమాలను బీజేపీ,టిఆర్‌ఎస్‌ పార్టీలు యువతకు చేసిన మోసాలను ప్రజలకు వివరించాలని కోరారు.ఈ కార్యక్రమంలో నల్గొండ జిల్లా అధ్యక్షులు గౌని రాజరమేష్‌ యాదవ్‌.పీసీసీ సభ్యులు జలా నర్సింహారెడ్డి.వెంకటేశ్వర రావు.శ్రీధర్‌ రెడ్డి.యూవజన కాంగ్రెస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొర్ర రాంసింగ్‌ నాయక్‌,రాష్ట్ర కార్యదర్శి లక్ష్మి,నియోజకవర్గ కార్యవర్గ సభ్యులు కొర్ర గౌతమి.కొర్ర నాగరాజు నాయక్‌.సుజిత్‌ యాదవ్‌.రమేష్‌ నాయక్‌,రమ్మీ నాయక్‌.యువజన కాంగ్రెస్‌ నేతలు శేఖర్‌ గౌడ్‌.రహీమ్‌. కొర్ర బాలక్రిష్ణ.సేవ నాయక్‌.ఖదీర్‌. రాజు.సాగర్‌.రాము.వెంకట్‌,జలందర్‌,శివ,అనిల్‌.తదితరులు పాల్గొన్నారు.
-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు