Friday, May 3, 2024

ఎక్కువే ఇచ్చాం..

తప్పక చదవండి
  • కేంద్రానికి తెలంగాణ మీద ఎలాంటి వివక్ష లేదు
  • రహదారుల నిర్మాణం ఇక్కడే చేసాం..
  • మోడీ పాలనలో అన్ని రంగాల్లో అభివృద్ధి
  • రైతు శ్రేయస్సు కోసం కేంద్ర పని చేస్తోంది..
  • 2024లోనూ కేంద్రంలో ఏర్పడేది మోదీ ప్రభుత్వమే
  • కరీంనగర్‌ పర్యటనలో స్పష్టం చేసిన కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్

హైదరాబాద్, దేశంలో మళ్లీ వచ్చేది బీజేపీ సర్కారేనన్నారు కేంద్ర మాజీ మంత్రి ప్రకాష్ జవదేకర్. దేశ క్షేమమే ప్రథమ ప్రాధాన్యంగా మోడీ పనిచేస్తున్నారని కొనియాడారు. తొమ్మదేళ్ల పాలనలో ఒక్క అవినీతి ఆరోపణ లేదన్నారు. తమది 24 గంటలు పనిచేసే సర్కార్ అని అన్నారు. దేశంలో అవినీతి రహిత సర్కార్ ను మొదటి సారి చూస్తున్నామన్నారు. ఈ విషయంలో ప్రతిపక్షాల అవినీతి ఆరోపణలు కూడా లేవని అన్నారు. బీజేపీ సర్కారు హయాంలో దేశం సబ్ కా సాత్ సబ్ కా వికాస్ లక్ష్యంతో ముందుకు వెళ్తోందని పేర్కొన్నారు. బీజేపీ సర్కారు తొమ్మిదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా మోదీ హయాంలో జరిగిన అభివృద్ధిని వివరించడానికి బీజేపీ దేశవ్యాప్తంగా సంపర్క్ అభియాన్ సభలు నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమంలో భాగంగా కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ ఎంపీ ప్రకాష్ జవదేకర్ ఆదివారం కరీంనగర్ లో పర్యటించి మీడియాతో మాట్లాడారు.

కాళేశ్వరం ప్రాజెక్టు కోసం తాము అన్ని అనుమతిలిచ్చామని..ఈ వషయంలో కేసీఆర్ కూడా తమను మెచ్చుకున్నారన్నారు. నేషనల్ థర్మల్ ప్రాజెక్టు, రామగుండం ఎరువుల ప్రాజెక్టులు ఇచ్చామన్నారు. పంటలకు మద్ధతు ధర విషయంలో మోడీ సర్కారు రైతులకు మేలు చేశారన్నారు. వరితో సహా.. ఇతర పంటలకు మద్ధతుధరలు పెంచామన్నారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణలోనే ఎక్కువ రహదారులు నిర్మిస్తున్నట్లు చెప్పారు. తెలంగాణపై కేంద్ర ప్రభుత్వానికి ఎలాంటి వివక్ష లేదని.. ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువే ఇచ్చామని అన్నారు. దేశంలో 13 కోట్ల మంది రైతులు సాయిల్ హెల్త్ కార్డులు పొందారని తెలిపారు. అంతర్జాతీయ మార్కెట్‌లో పెరుగుతున్న ధరల ప్రభావం రైతులపై పడకుండా ఎరువుల సబ్సిడీని 5 రెట్లు పెంచారని గుర్తు చేశారు. 2013-14లో వ్యవసాయ బడ్జెట్ కేవలం రూ.21,000 కోట్లు మాత్రమేనని ఇప్పుడు రూ.1,25,000 కోట్లకు పెరిగిందని అన్నారు. వ్యవసాయ క్రెడిట్ ఇప్పుడు రూ.20 లక్షల కోట్లకు పెరిగినట్లు వెల్లడించారు. దేశంలో ఆహారధాన్యాల ఉత్పత్తి 323 లక్షల మెట్రిక్ టన్నులు కాగా.. వరి మూడు రెట్లు, గోధుమ రెండింతలు ఎక్కువగా సేకరిస్తున్నామని తెలిపారు. వ్యవసాయ మౌలిక సదుపాయాల కొరకు కేంద్ర ప్రభుత్వం రూ.లక్ష కోట్లు కేటాయించిందన్నారు.పంటల బీమా పథకం కింద రైతులకు రూ.1,33,000 కోట్ల పరిహారం చెల్లించామని.. 11 కోట్ల మంది రైతులు కిసాన్ సమ్మాన్ నిధి కింద రూ.2,60,000 కోట్లు లబ్ధి పొందారని చెప్పారు. వారిలో 39 లక్షల మంది తెలంగాణ రైతులు ఉన్నారని అన్నారు. 1.12 లక్షల మంది కరీంనగర్‌కు చెందిన రైతులే ఉన్నారని తెలిపారు. దేశంలో 80 కోట్ల మందికి గత మూడు సంవత్సరాలుగా ఉచిత బియ్యం అందించామన్నారు. 40 కోట్ల ముద్ర రుణాలు, 37 కోట్ల ఆయుష్మాన్ భారత్ కార్డులు, 30 కోట్ల సురక్ష బీమా యోజన, 13 కోట్ల జీవన్ జ్యోతి బీమా యోజన, 10 కోట్ల జల్ జీవన్ కనెక్షన్లు, 11 కోట్ల మరుగుదొడ్లు, 10 కోట్ల ఉచిత ఎల్.పీ.జీ. కనెక్షన్లు, 3.5 కోట్ల పీఎం ఆవాస్ యోజన, 3.5 కోట్ల విద్యుత్ కనెక్షన్లు వంటి పథకాలన్నీ పేదలకు.. ప్రత్యేకించి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీలకు సాధికారత కల్పించాయని అన్నారు. లక్షలాది మంది మైనారిటీ విద్యార్థులు ప్రీమెట్రిక్, పోస్ట్ మెట్రిక్, గ్రాడ్యుయేషన్, పీహెచ్ స్కాలర్‌షిప్‌లు పొందుతున్నారని చెప్పారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు