Saturday, July 27, 2024

స్క్రూ డ్రైవర్‌తో కళ్లు పొడిచి.. నరాలను తెగ్గోసి..

తప్పక చదవండి
  • వికారాబాద్‌లో నర్సింగ్ విద్యార్థిని కిరాతక హత్య..
  • పరిగి మండలంలో కాళ్ళా పూర్ గ్రామంలో దారుణ ఘటన
  • యువతి తలపై కత్తితో దాడి.. కళ్లు ధ్వంసం.. ఒళ్లంతా గాట్లు
  • కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులు
  • బావతో గొడవ తర్వాతే శిరీష బయటకు వెళ్లిపోయిందని ఆరోపణలు

హైదరాబాద్, వికారాబాద్‌ జిల్లాలో నర్సింగ్ చదువుతున్న విద్యార్థిని దారుణ హత్యకు గురైంది. ఈ సంఘటన జిల్లాలోని పరిగి మండలం కాళ్లాపూర్‌ గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన శిరీష(19) ఇంటర్మీడియట్‌ పూర్తి చేసి వికారాబాద్‌లోని ఓ ప్రైవేటు కళాశాలలో నర్సింగ్‌ శిక్షణ తీసుకుంటోంది. జూన్​ 10 అర్ధరాత్రి వరకు ఇంట్లోనే ఉన్న శిరీష.. తెల్లారి లేచి చూసే సరికి మాత్రం ఇంట్లో కనిపించలేదు. కంగారుపడిన తల్లి ఊరంతా వెతికింది. తెలిసినవాళ్లతో అన్ని చోట్లలో గాలించింది. అయినా ఫలితం లేదు. తీరా.. మధ్యాహ్నం గ్రామ శివారులో ఉన్న చెరువు దగ్గర.. శిరీష దుస్తులు కనిపించాయి. దీంతో.. వెంటనే చెరువులో చూడగా.. విగతజీవిగా శిరీష మృతదేహం తేలుతోంది. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వగా.. హుటాహుటిన ఘటనా స్థలికి చేరిన పోలీసులు.. స్థానికుల సహాయంలో శిరీష మృతదేహాన్ని బయటకు తీశారు. సమాచారం అందుకున్న వెంటనే పరిగి డీఎస్పీ కరుణసాగర్ రెడ్డి కూడా ఘటనా స్థలానికి చేరుకుని.. మృతదేహాన్ని, ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. యువతి తలపై దుండగులు కత్తితో దాడి చేసినట్టు గుర్తించారు. కళ్లు పూర్తిగా ధ్వంసం అయ్యాయి. మృతదేహంపై బ్లేడు గాట్లున్నట్టు పోలీసులు గుర్తించారు. అసలు శిరీష రాత్రి బయటకు ఎందుకొచ్చింది. ఎవరి కోసం వచ్చింది. ఎవరు తీసుకొచ్చారు. ఎవరు చంపేశారు.. ఎందుకు చంపేశారు.. ఇంత క్రూరంగా చంపడానికి గల కారణాలేంటీ.. ఇలాంటి కారణాలపై సమగ్ర విచారణ చేసి.. నిందితులను గుర్తించి శిక్షిస్తామని డీఎస్పీ తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ హాస్పిటల్‌కి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు. శిరిష ఆ సమయంలో బయటికి ఎందుకు వెళ్లింది..? ఎవరినైనా కలిసేందుకు వెళ్లిందా..? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

పోలీసుల దర్యాప్తులో కొన్ని ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి.. శిరీష కుటుంబ సభ్యులు చెప్తున్న విషయాలు, మృతదేహం కనిపిస్తోన్న తీరును చూస్తుంటే.. చాలా డౌటనుమానాలు మెదళ్లను తొలిచేస్తున్నాయి అన్నారు.. ఈ నేపథ్యంలోనే శిరీషను హత్య చేసింది బావ అనిలేనా..? లేక గుర్తుతెలియని దుండగులా..? అనే వివిధ కోణాల్లో పరిగి పోలీసులు దర్యాప్తు సాయిగిస్తున్నట్టు తెలుస్తోంది.. ఈ క్రమంలోనే పోలీసులు మృతురాలు శిరీష తండ్రి జంగయ్య, తమ్ముడు శ్రీకాంత్, బావ అనిల్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

- Advertisement -

అయితే.. శనివారం రాత్రి ఒంటి గంటకు లేచి చూస్తే.. ఇంట్లో శిరీష కనిపించలేదని ఆమె సోదరి, తండ్రి చెప్తున్నారు. అయితే.. ఆమె బయటికి వెళ్లినప్పుడు బయట నుంచి గడియ పెట్టి పోయిందని చెప్తున్నారు. తెల్లారి నుంచి శిరీష కోసం వెతుకుతున్నామని చెప్తున్నారు. అయితే.. శిరీష తల్లికి ఆస్తమా ఉండగా అది కాస్త ఎక్కువవటంతో.. ఆమెను ఇటీవలే నిమ్స్‌లో జాయిన్ చేశారు. ఇంట్లో శిరీష, ఆమె సోదరితో పాటు ఇద్దరు సోదరులు, తండ్రి ఉంటున్నారు. ఈ క్రమంలో.. నిన్న సాయంత్రం.. సోదరి భర్త అనిల్ ఇంటికి వచ్చి గొడవ పడ్డాడని… ఈ గొడవలో శిరీషను తిట్టటంతో పాటు, కొట్టాడంటూ స్థానికులు ఆరోపిస్తున్నారు. దీంతో.. మనస్తాపం చెందిన శిరీష ఇంటి నుంచి బయటికి వెళ్లి ఉంటుందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

సాయంత్రం జరిగిన గొడవ తర్వాత కట్ చేస్తే.. ఆదివారం రోజు మధ్యాహ్నం శిరీష మృతదేహంగా కనిపించింది.. అది కూడా అత్యంత దారుణంగా హత్య కాబడి కనిపించింది. ఇది పలు అనుమానాలకు తావిస్తుంటే.. తాను మాత్రం శిరీష కనిపించట్లేదని చెప్పాకే ఇంటికి వచ్చానంటూ సోదరి భర్త చెప్తున్నట్టు సమాచారం. బావ కొట్టటం వల్లే బయటకు వెళ్లిపోయిందా.. లేదా మరేదైనా కారణం ఉందా.. అసలు ఆ గొడవ దేని గురించి జరిగింది.. అనేవి కూడా ఇప్పుడు తేలాస్సిన డౌట్లు. బావ అనిల్ గొడవ వల్లే శిరీష వెళ్లిందనుకున్నా.. ఇంత దారుణంగా హత్య చేసి.. వాళ్ల ఇంటికి కిలోమీటర్ దూరంలో పడేశారంటే.. ఆ నిందితులు ఎవరై ఉంటారన్నది ఇప్పుడు సర్వత్రా ఆసక్తి రేకెత్తిస్తోన్న ప్రశ్న.

అయితే.. ఈ హత్య చేసింది మాత్రం ఒక్కరు కాదని పోలీసులు అనుమానిస్తున్నారు. ఒకరి కంటే ఎక్కువ మందే ఈ హత్యలో పాల్గొని ఉంటారని స్ట్రాంగ్‌గా చెప్తున్నారు. మరోవైపు.. ఇంట్లో మెబైల్ గురించే గొడవ జరిగిందని కుటంబ సభ్యులు చెప్తున్నారు. ఫోన్‌కు పాస్‌వర్డ్ లాక్ వేసుకుందని.. అందుకే గొడవ జరిగిందని..చెప్తున్నారు. ఈ నేపథ్యంలో శిరీష సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు.. కాల్ డేటాను పరిశీలిస్తున్నారు. లాస్ట్ కాల్ ఎవరికి చేసింది.. వాట్సప్ మెస్సేజ్‌ల ద్వారా ఏదైనా క్లూ దొరుకుతుందా అని చూస్తున్నారు. మరోవైపు… ఆమె హత్యకు వాడిన కత్తులు గానీ, స్క్రూడ్రైవర్లు గానీ.. మృతురాలి ఇంట్లో గానీ గ్రామంలో అనుమానితుల ఇళ్లలో గానీ దొరుకుతాయేమో అని వెతుకుతున్నారు.

ఇటీవలే పార్మసి కాలేజీలో చేరిన శిరీషకు.. లవ్ స్టోరీలేమైనా ఉన్నాయా.. లేదా ఎవరైన పోకిరీల నుంచి వేధింపులు ఉన్నాయా.. అనే కోణంలో కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. మరోవైపు.. కుటుంబ సభ్యులు మాత్రం తమకు ఎవ్వరి మీద అనుమానం లేదంటూ చెప్తున్నారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేసిన తర్వాతే ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉందని పోలీసులు చెప్తున్నారు. అయితే.. స్థానికులు చెప్పిన దాని ప్రకారం.. బావతో గొడవ తర్వాత కనిపించకుండా పోయిన శిరీష.. మృతదేహంగా తేలేవరకు మధ్యలో ఏం జరిగిందనేది ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు