Saturday, July 27, 2024

యూజీసీ ఫెలోషిప్‌ మొత్తం పెంపు

తప్పక చదవండి

హైదరాబాద్‌ : విద్యార్థులకు యూజీసీ అందించే వివిధ ఫెలోషిప్‌ల ఆర్థిక సాయాన్ని పెంచింది. ఇప్పటివరకు జూనియర్‌ రీసెర్చ్‌ ఫెలోషిప్‌ కింద నెలకు రూ.31 వేల చొప్పు న రెండేళ్లపాటు చెల్లించేవారు. దాన్ని రూ.37 వేలకు పెంచారు. సీనియర్‌ రీసెర్చ్‌ ఫెలోషిప్‌ కింద రూ.35 వేలకు బదులు రూ.42 వేలు ఇవ్వనున్నారు. ‘సావిత్రిబాయి జ్యోతిరావు ఫులే ఫెలోషిప్‌ ఫర్‌ సింగిల్‌ గర్ల్‌ చైల్డ్‌’కు కూడా పై మొత్తం వర్తిస్తుంది. డీఎస్‌ కొఠారి పోస్ట్‌ డాక్టోరల్‌ ఫెలోషిప్‌నకు రూ.47 వేల నుంచి రూ.54 వేల వరకు (మూడేళ్లు) ఇవ్వగా…దాన్ని రూ.58 వేల నుంచి రూ .67 వేలకు పెం చారు. ఈ మొత్తం, పోస్ట్‌ డాక్టోరల్‌ ఫెలోషిప్‌ మహిళలతో పాటు ఎస్సీ, ఎస్టీలకు కూడా వర్తిస్తుంది. 2023 జనవరి 1 నుంచి ఈ పెంపు వర్తిస్తుందని యూజీసీ పేర్కొంది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు