Friday, May 17, 2024

టంగ్ స్లిప్..

తప్పక చదవండి
  • విమర్శల ఆరోపణ నిజమేనని ఒప్పుకున్న మంత్రి మల్లారెడ్డి..
  • ఆర్టీసీ విలీనం ఎన్నికల స్టంటేనంటూ వ్యాఖ్య
  • ఏదైనా అనుకోండన్న కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి
  • కార్మికులు సంతోషంగా ఉన్నారా? లేరా? చూడాలని సూచన

మైకు పట్టుకున్నారంటే చాలు డైలాగులతో అల్లాడిస్తుంటారు.. ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తూ ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తుంటారు. తాను నడిచొచ్చిన ప్రయాణాన్ని తనదైన మాటల్లో చెప్తూ.. అందరినీ ఆకర్షిస్తుంటారు. ఇదంతా ఎవరో హీరో గురించి కాదు.. మన రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి గురించే. అయితే.. ఆయన ఎప్పటిలాగే ఇప్పుడు కూడా ఆసక్తిర స్టేట్‌మెంట్ ఇచ్చి వార్తల్లో హాట్ టాపిక్ అయ్యారు. ఇటీవలే జరిగిన కేబినెట్ మీటింగ్‌లో తీసున్న ప్రతిష్టాత్మక నిర్ణయం.. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయటం. ఈ నిర్ణయంపై సర్వత్రా హర్షాతిరేఖాలు వ్యక్తమవుతున్నాయి. ఆర్టీసీ ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తుండగా.. విపక్ష పార్టీల నేతలు మాత్రం ఇది కచ్చితంగా అధికార పార్టీ ఎన్నికల స్టంటేనని.. దీని వెనుక చాలా పెద్ద కుట్ర ఉందంటూ తీవ్ర విమర్శలు చేస్తున్నారు.

అయితే.. ఇదే విషయంపై అధికార పార్టీకి చెందిన మంత్రి మల్లారెడ్డి కూడా ఒప్పుకున్నారు. బుధవారం రోజున హైదరాబాద్‌ ఫిర్జాదిగూడలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం వద్ద సీఎం కేసీఆర్‌ చిత్రపటానికి మంత్రి మల్లారెడ్డి ఆధ్వర్యంలో పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి మల్లారెడ్డి.. టీఎస్ ఆర్టీసీ కార్మికులకు డబుల్కమీటాలా ఊహించని విధంగా వాళ్లను ప్రభుత్వ ఉద్యోగులుగా సీఎం కేసీఆర్ ప్రకటించారని పేర్కొన్నారు.

- Advertisement -

ఈ క్రమంలోనే.. విపక్షాలు ఆరోపిస్తున్నట్టు ఆర్టీసీ విలీనం అనేది ఎన్నికల స్టంటేనా అని ఓ జర్నలిస్టు అడగ్గా.. ఏమాత్రం తడుముకోకుండా… “ఎన్నికల స్టంట్ అనుకో.. ఏదైనా అనుకో.. మాది రాజకీయ పార్టీ.. త్వరలోనే ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఎట్లైనా ఎన్నికల స్టంట్ ఉంటది.” అంటూ మల్లారెడ్డి చెప్పుకొచ్చారు. ఆ మాట అన్న వెంటనే తేరుకున్న మల్లారెడ్డి.. “ఎన్నికల కోసమే అయినా ఆర్టీసీ కార్మికులకు మంచే జరిగింది. ఆర్టీసీ విలీనం చేయాలంటే దమ్ము, ఫండ్స్‌ ఉండాలి. సీఎం కేసీఆర్‌ నిర్ణయంతో కార్మికులంతా హ్యాపీగా ఉన్నారు.” అంటూ సవరించుకున్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు