Saturday, April 27, 2024

రేషన్‌ డీలర్ల నయా దందా…

తప్పక చదవండి
  • లబ్ధిదారుల నుండే బియ్యం కొనుగోలు..
  • దళారులతో కలిసి అక్రమ వ్యాపారం…
  • పట్టించుకోని రెవెన్యూ, పౌరసరఫరాల శాఖ అధికారులు…
    గోదావరిఖని టౌన్‌ : రాష్ట్ర ప్రభుత్వం పేదలకు ప్రజాపంపిణి ద్వారా అందిస్తున్న రేషన్‌ బియ్యం పక్కదారి పడుతున్నాయి.. రేషన్‌ డీలర్లు, దళారుల తో చేతులు కలిసి సొమ్ము చేసుకుంటున్నారు. దళారులు రాత్రి వేళల్లో సరిహద్దులు దాటించి లక్ష లు సంపాదిస్తున్నారు.. గోదావరిఖని నగరంలో పలు డివిజన్‌ లో ని రేషన్‌ డీలర్లు ఒక గ్రూప్‌ గా ఏర్పడి తమ వ్యాపారాన్ని దర్జాగా సాగిస్తున్నారు.. స్థానిక గాంధీ నగర్‌, జవహర్‌ నగర్‌, రమేష్‌ నగర్‌, తిలక్‌ నగర్‌, విఠల్‌ నగర్‌, ఫైవ్‌ ఇంక్లైన్‌, గంగా నగర్‌ తో పాటు పలు ఏరియా లో ని రేషన్‌ డీలర్లు లబ్ధిదారుల నుండి నేరుగా కిలో రూ 10 నుండి 12 రూపాయల చొప్పున కొనుగోలు చేస్తున్నారులి. కొనుగోలు చేసిన బియ్యం ను అనుకూలమైన సమయం లో లినగరంలో బియ్యం దందా చేసే వ్యక్తి కి కిలో రూ 15 చొప్పున విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటూన్నారులి. ఇంత జరుగుతున్న సంబంధిత రెవెన్యూ, పౌర సరఫరా శాఖ అధికారులు తనిఖీలు చేయకపోవడం పలు అనుమానాలకు తావిస్తుంది. ఎవరైనా ఫిర్యాదు చేస్తే తప్ప తనిఖీ చేసే పరిస్థితి లేదు.అధికారులు తమకేమి పట్టనట్లు వ్యవహారించడం పట్ల పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. డీలర్లు ప్రతి నెల సంబంధిత అధికారులకు మామూళ్లు ముడుతున్నట్లు ఆరోపణలు లేకపోలేదు..

ప్రజా పంపిణీ వ్యవస్థ పై పర్యవేక్షణ కరువు..
ప్రజా పంపిణీ వ్యవస్థ పై అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో డీలర్ల దందా అడ్డు లేకుండా పోతుంది. ప్రభుత్వం ప్రజా పంపిణీ వ్యవస్థ పక్కదారి పట్టకుండా ఎన్ని చర్యలు తీసుకుంటున్న క్షేత్రస్థాయిలో అధికారులు ప్రభుత్వ లక్ష్యానికి తూట్లు పొడుస్తున్నారు. రేషన్‌ డీలర్లు కొనుగోలు చేసిన బియ్యం క్వింటాళ్ల కొద్దీ దళారులకు అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్నారు. ఇంత జరుగుతున్న రెవెన్యూ అధికారులు కానీ పౌరసరఫరా శాఖ అధికారులు కానీ ఏనాడు రేషన్‌ షాపులు తనిఖీలు చేసిన దాఖలాలు లేవు. రేషన్‌ డీలర్లు బియ్యాన్ని పక్కదారి పట్టకుండా చూసేందుకు ప్రభుత్వం బయోమెట్రిక్‌ యంత్రాలు తీసుకువచ్చింది. అయినా కూడా వారి దందా మాత్రం ఆగడం లేదు. వేలిముద్రలు వేసి బియ్యం తీసుకోవాల్సిన వినియోగదారులు అక్కడే డీలర్‌ కు విక్రయిస్తున్నారు. ప్రతినెల 5వ తేదీ నుండి 20వ తేదీ వరకు బియ్యం పంపిణీ చేయాల్సి ఉన్న కొంతమంది డీలర్లు వారం రోజులు మాత్రమే పంపిణీ చేస్తున్నారని లబ్ధిదారులు పేర్కొంటున్నారు. ప్రతి నెల రేషన్‌ షాపులకు వచ్చిన కోటా ఎంత? వినియోగదారులు తీసుకున్నవి ఎన్ని? మిగిలిన కూడా ఎంత? అనే లెక్కలు తెలుస్తున్నాయి. కానీ పౌరసరఫరాల శాఖ అధికారులు మాత్రం షాపులను తనిఖీ చేయడం లేదు. పంపిణీ అయిన కోటా కన్న పోను మిగిలిన కోటాకు మించి షాపులోనే ఉంటున్న అధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదని ఆరోపణలున్నా యి. రాత్రి వేళల్లో డీలర్లు షాపుల నుండి దళారులకు విక్రయిస్తున్నారు.. బియ్యం దందా చేసే వాళ్లు ఎక్కడెక్కడ ఉంటారో అధికారులకు తెలిసినప్పటికీ పెద్దగా పట్టించుకోవడంలేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రేషన్‌ బియ్యం దందాలో దళారులు, డీలర్లు లాభాలు గడిస్తున్నారు.అధికారులు తనిఖీలు చేయకపోవడం కారణంగానే రేషన్‌ బియ్యం పక్కదారి పడుతుంది. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి లక్షల్లో జరుగుతున్న ఈ అక్రమ దందాను అరికట్టాలని ప్రజలు కోరుతున్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు