మేడ్చల్ : మండలంలోని గుండ్ల పోచంపల్లి మున్సిపల్ రోడ్డు మధ్యలో ఉన్న మ్యాన్ హోల్ పగిలి పోయి హనదారులకు,మరియు అటుగా వెళ్లే ప్రజలకు చాలా ఇబ్బందిగా ఉందని గుండ్లపోచంపల్లి మున్సిపల్ 5వ వార్డు యువ నాయకులు కుండ భానుచందర్ అన్నారు,ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… గుండ్లపోచంపల్లి మున్సిపల్ పరిధిలోని ఐదవ వార్డు నుండి అప్పరేల్ పార్క్ కు వెళ్లేదారిలో నిత్యం కార్మికులు, మరియు కాలేజీ లకు వెళ్లే విద్యారులు అనేక మంది ఈ మీదుగా వెళ్తుంటారని కుండ భాను చందర్ అన్నారు, అలాగే కంపెనీలకు వెళ్లే భారీ వాహనాలు ఈ రోడ్డు మీదుగా వెళ్లడంతో రోడ్డు మాధ్యలో ఉన్న మ్యాన్ హోల్ పై కప్పు పగిలిపొయి మ్యాన్ హోల్ ప్రమాదకరంగా ఉందని కూడా ఆయన తెలిపారు, మున్సిపల్ అధికారులు కాస్త చొరవ తీస్కొని వెంటనే ఈ యొక్క మ్యాన్ హోల్ ను బాగుచేయాలని మున్సిపల్ చైర్మన్, మరియు కమిషనర్ ను కోరుతున్నట్లు ఆయన మీడియాకు తెలిపారు.