Friday, May 3, 2024

దారిదోపిడీని మించి భూ దోపిడీ..!

తప్పక చదవండి
  • విదేశీయుల గుప్పిట్లో ధరణి పోర్టల్‌
  • కేటీఆర్‌ సన్నిహితుడి చేతుల్లో ధరణి
  • రాత్రికి రాత్రే మాయమవుతున్న ప్రభుత్వ భూములు దారిదోపిడీని మించి భూ దోపిడీ..!
  • ధరణి పోర్టల్‌ నిర్వహణ వెనక పెద్ద మాఫియా
  • గజ్వెల్‌లో అమూల్‌కు అసైన్డ్‌ భూముల అప్పగింత
  • మంత్రి గంగుల కమలాకర్‌కూ భూమలు పందేరం
  • ధరణిపై మరోమారు ఆరోపణలు గుప్పించిన రేవంత్‌
  • కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే ధరణిని రద్దు చేసి అంతకంటే మెరుగైన పోర్టల్‌ను తీసుకొస్తాం..
  • కేసీఆర్‌ భూ అక్రమాలను కూడా బయటపెడతాం..
  • ఈ పోర్టల్‌ ద్వారా మన డీటైల్స్‌ అన్నీ విదేశీయుల చేతుల్లోకి
    వెళ్తున్నాయి.

హైదరాబాద్‌ : తెలంగాణ ప్రజల ఆస్తులు, భూములు, వ్యక్తిగత వివరాలు విదేశీయుల చేతుల్లోకి వెళుతున్నాయని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ధరణి ద్వారా భూములు మాయమవుతున్నాయిన అన్నారు. ప్రభుత్వ భూములకు ప్రైవేట్‌ వ్యక్తులు యజమానులు అవుతున్నారని అన్నారు. గురువారం గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పార్టీ సీనియర్‌ నేతలు కోదండరెడ్డి, సంపత్‌కుమార్‌ తదితరులతో కలిసి భూమి డిక్లరేషన్‌ విడుదల చేశారు. ప్రజలు, మీడియాకు ధరణికి సంబంధించి టెర్రాసిస్‌ కంపెనీ మాత్రమే కనిపిస్తోందన్న రేవంత్‌రెడ్డి.. ధరణి పోర్టల్‌ వెనుక పెద్ద మాఫియా దాగుందన్నారు. దీనిపై ఆధారాలతో సహా సీరియల్‌గా బయటపెడతానని తెలిపారు.ధరణి మొత్తం యువరాజు కెటిఆర్‌ మిత్రుడు గాదె శ్రీధర్‌ రాజు చేతుల్లో ఉంది. ఇందులో బ్రిటిష్‌ ఐల్యాండ్‌కు సంబంధించిన పెట్టుబడులు ఉన్నాయి. దారి దోపిడీ దొంగల కంటే భయంకరమైన దోపిడీ జరుగుతోంది. లక్షల ఎకరాల ప్రభుత్వ భూములు మాయం అవుతున్నాయి. ధరణి పోర్టల్‌ నిర్వహణ విదేశీయుల చేతుల్లోకి వెళ్లి పోయింది. అందరి వివరాలు విదేశీయుల గుప్పిట్లో ఉన్నాయి.. ఇది అత్యంత ప్రమాదకరం అని రేవంత్‌ వ్యాఖ్యానించారు. .గజ్వేల్‌లో 1500 ఎకరాల అసైన్డ్‌ భూమిని చట్టవిరుద్ధంగా ప్రభుత్వం గుంజుకుంది. అమూల్‌ డైరీకి వందల ఎకరాలు కట్టబెట్టారు. గంగుల కమాలకర్‌కు భూములు కేటాయించారు. హైకోర్టు ఆదేశాలను ఉల్లంఘించి దేవాదాయ భూములను ఫార్మా కంపెనీలకు కట్టబెట్టారు. ధరణి దోపిడీలపై అన్ని ఆధారాలతో పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇస్తానని అన్నారు. త్వరలో ధరణి ఫైల్స్‌ రిలీజ్‌ చేయబోతున్నాం. ధరణిలో పెట్టుబడి దారులు ఎవరో కేంద్ర ప్రభుత్వం నిగ్గు తేల్చాలని కిషన్‌రెడ్డికి సవాల్‌ విసురుతున్నట్లు వెల్లడిరచారు. మంత్రి కేటీఆర్‌ ఢల్లీి పర్యటనతో బిజెపి, బిఆర్‌ఎస్‌ ఫెవికాల్‌ బంధాన్ని బలోపేతం చేసేందుకు బీజం పడిరదని ఆరోపించారు. ధరణి పోర్టల్‌లో జరుగుతున్న అక్రమాలను గురించి రేవంత్‌ రెడ్డి వివరించారు. ధరణి పేరుతో కేసీఆర్‌ కుటుంబం దోచుకుంటోందని, రాత్రిపూట ధరణి రిజిస్టేష్రన్లు జరుగుతున్నాయని అన్నారు. ధరణి దోపిడీలో శ్రీధర్‌రాజు కీలక పాత్ర పోషిస్తున్నారని ఆరోపించారు. ప్రజల ఆస్తులు వివరాలు విదేశీ సంస్థలకు చేరుతున్నాయని.. ఆరోపించారు. త్వరలోనే తాను ధరణి పోర్టల్‌ ఫెయిల్యూర్‌ పై పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇస్తానని చెప్పారు. ధరణిలో జరిగిన అక్రమాలను జులై 15 తర్వాత బయటపెడతామని అన్నారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే ధరణిని రద్దు చేసి అంతకంటే మెరుగైన పోర్టల్‌ను తీసుకొస్తామని హామీ ఇచ్చారు. కేసీఆర్‌ భూ అక్రమాలను కూడా బయటపెడతామని అన్నారు. ధరణి పోర్టల్‌ నిర్వహిస్తున్న సంస్థలో పెట్టుబడి పెట్టిన వారు ఆర్థిక నేరగాళ్లు. ధరణి పోర్టల్‌ను నిర్వహిస్తున్న వారిలో విదేశీయులు ఉన్నారని, ఈ పోర్టల్‌ ద్వారా మన వివరాలు అన్నీ విదేశీయుల చేతుల్లోకి వెళ్తున్నాయని అన్నారు. అనేక చేతులు మారి చివరకు.. ధరణి పోర్టల్‌ బ్రిటిష్‌ ఐల్యాండ్‌ చేతికి వెళ్లిందని అన్నారు. ధరణిలోని లోటుపాట్లను ఆసరాగా తీసుకొని నిషేధిత జాబితాలోని భూములను అనుచరులకు రిజిస్టేష్రన్‌ చేసుకుంటున్నాని రేవంత్‌ రెడ్డి ఆరోపించారు. ప్రభుత్వ భూములను అనుచరులకు రిజిస్టేష్రన్‌ చేసి వెంటనే ప్రొహిబిషన్‌ లాక్‌ చేస్తున్నారని, ధరణి పోర్టల్‌ మొత్తం కేటీఆర్‌ మిత్రుడు శ్రీధర్‌ గాదె చేతిలో ఉందని అన్నారు. దేవాదాయ భూములను అక్రమంగా ఫార్మా కంపెనీలకు కట్టబెట్టాలని చూశారని రేవంత్‌ రెడ్డి ఆరోపించారు. ఈ దేశంలో అత్యంత పేద పార్టీ కాంగ్రెస్‌ పార్టీ అని.. ప్రస్తుతం ఏ రకమైన ఆర్థిక సంక్షోభం ఎదుర్కుంటున్నామో అర్థం చేసుకోవాలని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి అన్నారు. ఇప్పుడు రాజకీయ పార్టీలను దాటి.. ఏజెన్సీలు వచ్చాయని, ఈ రకం ఏజెన్సీలను నియమించుకోవడం చాలా ఖర్చుతో కూడుకున్నదని రేవంత్‌ రెడ్డి అన్నారు. బీఆర్‌ఎస్‌, బీజేపీలు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేందుకు సిద్దమయ్యాయని అన్నారు. బీజేపీ, బీఆర్‌ఎస్‌లను మనం జన బలంతో కొట్టాలని రేవంత్‌ రెడ్డి అన్నారు. పెండిరగ్‌లో ఉన్న మూడు జిల్లా కమిటీలను రెండు రోజుల్లో ప్రకటిస్తామని చెప్పారు. జులై 25లోగా గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అన్ని కమిటీలు పూర్తి చేస్తామని అన్నారు. ప్రభుత్వ ఉద్యోగులను అధికార పార్టీ తమ పార్టీకి అనుకూలంగా పని చేయించు కుంటోందని చెప్పారు. ఇది ఒక రకంగా అధికార దుర్వినియోగం లాంటిదని అన్నారు. గ్రామ స్థాయిలోనే కాంగ్రెస్‌ అనుకూల, వ్యతిరేక ఓట్లను గుర్తించాలని చెప్పారు. గతంలో గ్రామ పెద్ద ఏపార్టీకి లేదా గుర్తుకు ఓటు వేయమని చెబితే ఆ గుర్తుకు గ్రామ ప్రజలు ఓటు వేసేవారని, కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదని అన్నారు. ఎన్నికల్లో వచ్చిన మార్పులు, సాంకేతికతను బీజేపీ, బీఆర్‌ఎస్‌ లు తమకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేస్తున్నాయని అన్నారు. దీన్ని కాంగ్రెస్‌ అధిగమించాలని చెప్పారు. ఆగస్టు 18న హైదరాబాద్‌ మండల అధ్యక్షులకు ట్రైనింగ్‌ కార్యక్రమం ఉంటుందని రేవంత్‌ రెడ్డి వెల్లడిరచారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు