Saturday, July 27, 2024

పొంగులేటికి ముఖ్య అనుచరుడు షాక్

తప్పక చదవండి

కాంగ్రెస్ వీడి బీఆర్ఎస్‌లో చేరిన తెల్లం వెంకట్రావ్‌

హైదరాబాద్ : మాజీ ఎంపీ, కాంగ్రెస్‌ నేత పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ముఖ్య అనుచరుడు అయిన తెల్లం వెంకట్రావ్‌ కాంగ్రెస్‌ పార్టీకి షాకిచ్చారు. నిన్న మొన్నటి వరకు పొంగులేటితో నడుస్తూ కాంగ్రెస్‌ పార్టీలో కొనసాగిన ఆయన.. అంతర్గత విబేధాలతో కాంగ్రెస్‌ను వీడి బీఆర్‌ఎస్‌లో చేరారు. భద్రాచలం, పినపాక, ఇల్లందు, అశ్వరావుపేట, కొత్తగూడెం నియోజకవర్గాల నుంచి కూడా పలువురు బీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ కార్యక్రమంలో మంత్రి పువ్వాడ, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు పాల్గొన్నారు. 2014 ఎన్నికల్లో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో కలిసి తెల్లం వైసీపీలో పనిచేశారు. పొంగులేటి ఖమ్మం ఎంపీగా పోటీ చేసి విజయం సాధిచంగా.. తెల్లం మహబూబాబాద్ ఎంపీగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. తర్వాత పొంగులేటితో కలిసి బీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. 2018 ఎన్నికల్లో భద్రాచలం టీఆర్ఎస్ (ఇప్పుడు బీఆర్ఎస్) పోటీ చేసి.. కాంగ్రెస్ అభ్యర్థి ఇదే పొదెం వీరయ్య చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత కూడా ఆయన భద్రాచలం బీ‌ఆర్‌ఎస్ ఇంఛార్జ్‌గా పనిచేశారు. అయితే పొంగులేటి బీఆర్ఎస్ పార్టీపై వ్యతిరేక గళం వినిపించగా.. ఆయన కూడా ఆ పార్టీకి దూరమయ్యారు. గతనెలలో ఖమ్మంలో జరిగిన కాంగ్రెస్ సభలో రాహుల్ గాంధీ సమక్షంలో పొంగులేటితో కలిసి హస్తం గూటికి చేరారు. తాజాగా.. కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పి తిరిగి బీఆర్ఎస్ గూటికి చేరారు.
భద్రాచలం టికెట్ హామీతో తెల్లం కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు తెలిసింది. అయితే అక్కడ అల్రెడీ పొదెం వీరయ్య సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉండటంతో తనకు టికెట్ కష్టమని భావించినట్లు సమాచారం. పొంగులేటి హామీ ఇచ్చినా టికెట్ దక్కే అకాశం లేకపోవటంతో ఆయన పార్టీ మారేందుకు రెడీ అయ్యారని ప్రచారం జరిగింది. తెల్లం పార్టీ వీడటం వెనుక మంత్రి హరీష్ రావు కీలక పాత్ర పోషించినట్లు తెలిసింది. భద్రాచలం టికెట్ ఇవ్వటంతో పాటు నియోజవర్గ అభివృద్ధికి నిధులు మంజూరు చేస్తానని మంత్రి హామీ ఇవ్వటంతో ఆయన పార్టీ మారినట్లు సమాచారం.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు