Tuesday, May 14, 2024

విచారణ షురూ.. ఆదాబ్‌ కథనానికి స్పందన

తప్పక చదవండి
  • పాల్వంచలోని గిరిజన బాలికల కళాశాల వసతి గృహంలో
    వార్డెన్‌ భర్తపై రాసిన కథనానికి విచారణకు ఆదేశించిన పీఓ

పాల్వంచ : పాల్వంచలోని గిరిజన బాలికల కళాశాల వసతి గృహంలో వార్డెన్‌ భర్త విద్యార్థినీలపై లైంగిక వేధింపులు, ఆరోపణల నేపథ్యంలో భద్రాచలం ఐటిడిఎ పిఓగౌతమ్‌ ఆదేశాల మేరకు భద్రాచలం జిసిడిఓ అలివేలుమంగతాయారు, ఇల్లందుకుచెందిన ఎటిడబ్ల్యుఓ రూపాదేవిలను విచారణాధికారులుగా నియమించారు. భర్తకాదు వీడు బేవకూఫ్‌,విద్యార్థినీలతో వార్డెన్‌ భర్త అసభ్యప్రవర్తన, గిరిజన బాలికల కళాశాలలో వెలుగు చూసిన దాష్టికం, ఆలస్యంగా వెలుగు చూసిన ఘటనపైఆదాబ్‌ హైదరాబాద్‌ బుధవారం ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. దీనిపై స్పందిం చిన అధికారులు బుధవారం పాల్వంచలోని బాలికల కళాశాలలో విచారణ చేపట్టారు. ఈవిచారణ పూర్తి చేసి సంబంధిత ఉన్నతాధికారులకు ఎంక్వైరీ రిపోర్టును అందచేస్తామని ఆదాబ్‌కు తెలిపారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు