Saturday, May 18, 2024

ఎగ్జిక్యూటివ్ క్యాడర్ పోస్టుల భ‌ర్తీకి భారత ప్రభుత్వం నోటిఫికేషన్ విడుద‌ల

తప్పక చదవండి

ఎలక్ట్రికల్ & మెకానికల్, ఎలక్ట్రానిక్స్ & టెలికమ్యూనికేషన్, ఫైనాన్స్, హిందీ, లీగల్, మార్కెటింగ్ & సేల్స్, మెటీరియల్స్ మేనేజ్‌మెంట్, సిబ్బంది, పబ్లిక్ రిలేషన్స్, సెక్రటేరియల్ త‌దిత‌ర విభాగాల‌లో ఎగ్జిక్యూటివ్ క్యాడర్ పోస్టుల భ‌ర్తీకి భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన కోల్‌ ఇండియా లిమిటెడ్‌ నోటిఫికేషన్ విడుద‌ల చేసింది. ద‌ర‌ఖాస్తు చేసుకునే అభ్య‌ర్థులు సంబంధిత విభాగంలో మెట్రిక్యులేషన్, డిప్లొమా, డిగ్రీ, ఎల్ఎల్‌బీ, సీఏ ఉత్తీర్ణ‌త‌తో పాటు క‌నీసం 3 నుంచి 7 ఏండ్ల ప‌ని అనుభ‌వం క‌లిగి ఉండాలి. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ద్వారా అభ్య‌ర్థుల‌ను ఎంపిక చేయ‌నున్నారు. ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ ప్రారంభంకాగా.. సెప్టెంబ‌ర్ 09 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
మొత్తం పోస్టుల సంఖ్య : 1764
పోస్టులు: ఎగ్జిక్యూటివ్ క్యాడర్వి
భాగాలు : ఎలక్ట్రికల్ & మెకానికల్, ఎలక్ట్రానిక్స్ & టెలికమ్యూనికేషన్, ఫైనాన్స్, హిందీ, లీగల్, మార్కెటింగ్ & సేల్స్, మెటీరియల్స్ మేనేజ్‌మెంట్, సిబ్బంది, పబ్లిక్ రిలేషన్స్, సెక్రటేరియల్ త‌దిత‌రాలు.
అర్హతలు: ద‌ర‌ఖాస్తు చేసుకునే అభ్య‌ర్థులు సంబంధిత విభాగంలో మెట్రిక్యులేషన్, డిప్లొమా, డిగ్రీ, ఎల్ఎల్‌బీ, సీఏ ఉత్తీర్ణ‌త‌తో పాటు క‌నీసం 3 నుంచి 7 ఏండ్ల ప‌ని అనుభ‌వం క‌లిగి ఉండాలి.
ఎంపిక: కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
దరఖాస్తు: ఆన్‌లైన్‌లో
దరఖాస్తు ఫీజు: లేదు
చివరితేదీ: సెప్టెంబ‌ర్ 09
వెబ్‌సైట్‌: www.coalindia.in

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు