Tuesday, May 21, 2024

మద్యం మత్తులో యువతిని వేధించిన ఘటనపై గవర్నర్ స్పందన…

తప్పక చదవండి
  • జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మద్యానికి బానిసైన కూలీ
  • బాలాజీనగర్ బస్టాండ్ వద్ద యువతిని వేధించి, అసభ్య ప్రవర్తన
  • రోడ్డుపై పావు గంట పాటు నగ్నంగా కూర్చున్న యువతి
    మద్యం మత్తులో ఓ వ్యక్తి… యువతిని వివస్త్రను చేసి వేధించిన సంఘటన హైదరాబాద్‌లోని జవహర్ నగర్‌లో చోటు చేసుకుంది. ఈ ఘటనపై రాష్ట్ర గవర్నర్ తమిళసై సౌందరరాజన్ స్పందించారు. ఈ ఘటన దురదృష్టకరమన్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి నివేదికను సమర్పించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, డీజీపీని ఆదేశించారు.
    జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మద్యానికి బానిసైన పెద్దమారయ్య అనే కూలీ ఈ నెల 6న (ఆదివారం) రాత్రి ఎనిమిదిన్నర గంటల ప్రాంతంలో తన తల్లితో కలిసి బాలాజీనగర్ బస్టాండ్ నుండి ఇంటికి వెళ్తున్నాడు. ఈ సమయంలో ఓ యువతి దుకాణం నుండి ఇంటికి వెళ్తుండగా పెదమారయ్య ఆమెపై చెయ్యి వేసి అసభ్యంగా ప్రవర్తించాడు. ఆమె ఆగ్రహించడంతో… దాడి చేశాడు. అంతేకాకుండా ఆమె దుస్తులు చించి లాగేశాడు. బైక్ పై వెళ్తున్న ఓ మహిళ ఎందుకు అలా చేస్తున్నావని ప్రశ్నించగా ఆమెపై కూడా దాడి చేశాడు. దాదాపు పదిహేను నిమిషాల పాటు ఆ యువతి రోడ్డుపై నగ్నంగా రోదిస్తూ కూర్చుంది. అతను వెళ్లిన తర్వాత కొంతమంది వచ్చి ఆమెపై దుస్తులు కప్పి, జవహర్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు