Monday, May 20, 2024

అక్కను చంపింది చెల్లె చందనే..

తప్పక చదవండి
  • దీప్తి మృతి కేసును ఛేదించిన పోలీసులు
  • చెల్లి చందనే అక్కను చంపినట్టు తేల్చిన పోలీసులు
  • ముక్కు, మూతికి ప్లాస్టర్ వేసి చంపేసిన చెల్లి
  • అరెస్టైన వారిలో బాయ్ ఫ్రెండ్, ప్రియుడి తల్లి, కారు డ్రైవర్
  • ఒంగోలు నుండి జగిత్యాలకు తీసుకువచ్చి విచారణ

హైదరాబాద్ : సంచలనం రేపిన జగిత్యాల జిల్లా కోరుట్లలోని భీమునిదుబ్బకు చెందిన టెక్కీ దీప్తి హత్య కేసు కొలిక్కి వచ్చినట్లుగా తెలుస్తోంది.దీప్తిది మర్డరేనని పోలీసులు తేల్చేశారు. చెల్లి చందనే దీప్తిని దారుణంగా చంపేసిందని పోలీసులు గుర్తించారు. దీప్తి మృతి చెందినప్పటి నుంచి తన చెల్లి చందన కనబడకుండా పోగా.. ఆమె కోసం నాలుగు బృందాలుగా ఏర్పడి పోలీసులు గాలించారు. కాగా.. ఆమె తన బాయ్ ఫ్రెండ్‌తో కలిసి ఇంటి నుంచి వెళ్లిపోయినట్టుగా ఓ ఆడియోను తన సోదరునికి పంపించటంతో పాటు, వాళ్లిద్దరు వెళ్లిపోతున్న దృశ్యాలు బస్టాండ్‌లోని సీసీ కెమెరాల్లో నిక్షిప్తమయ్యాయి. వీటన్నింటినీ పరిగణలోకి తీసుకున్న పోలీసులు.. తీవ్రంగా గాలించి శుక్రవారం సాయంత్రం వాళ్లిద్దరినీ ఒంగోలులోని ఓ లాడ్జ్‌లో పట్టుకున్నారు. ఇద్దరినీ అదుపులోకి తీసుకుని విచారించి.. వాళ్ల నుంచి కీలక విషయాలు రాబట్టారు.

అయితే.. విచారణలో తానే తన అక్క దీప్తిని చంపినట్టు చందన ఒప్పుకుంది. ఇంటి నుంచి వెళ్లేటప్పుడు దీప్తి ముక్కు, నోటికి ప్లాస్టర్ వేసి, పైనుంచి చున్నీ కూడా చుట్టి.. గాలాడకుండా చేసి వెళ్లిపోయినట్టు చెల్లి చందన ఒప్పుకుంది. బాయ్ ఫ్రెండ్, అతడి తల్లి, ప్రియుడి బంధువుతో పాటు కారు డ్రైవర్‌ కూడా ఇందులో భాగమైనట్టు పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది. అయితే.. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ కాలేజీలో బీటెక్ చదువుతున్న చందన.. సీనియర్ అయిన ఓ యువకుడితో ప్రేమలో పడింది. ఈ విషయాన్ని వాళ్లింట్లో చెప్పటంతో.. మతాతంతర వివాహం కావడం వల్ల చందన తల్లిదండ్రులు, అక్క దీప్తి ససేమిరా అన్నారు. ఇదే విషయమై తల్లిదండ్రులు లేని సమయంలో అక్క దీప్తితో చందన నాలుగు రోజుల క్రితం ఇంట్లో గొడవపడింది. ముక్కు, మూతికి ప్లాస్టర్ వేసి చున్నీ చుట్టి వెళ్లిపోయింది. దీంతో శ్వాస ఆడక దీప్తి మృతి చెంది ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు