Sunday, May 19, 2024

అభివృద్ధి పనులు పరిశీలించిన కలెక్టర్‌

తప్పక చదవండి
  • గడువలోగా పనులు పూర్తి చేయండి
  • అధికారులను ఆదేశించిన కలెక్టర్‌ వి.పి.గౌతమ్‌

ఖమ్మం : ఐడిఓసి ప్రాంగణంలో నిర్మితమవుతున్న ఈ.వి.ఎం గౌడౌన్‌ పనులను జిల్లా కలెక్టర్‌ వి.పి.గౌతమ్‌ సోమవారం తణిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన ఆర్‌అండ్‌బి శాఖ అధికారులు, గుత్తేదారులకు పలు సూచనలు చేశారు. నూతన ఇవిఎం గౌడౌన్‌ పనులు సాధారణ ఎన్నికల నోటిఫికేషన్‌ కు ముందే పూర్తయ్యేల కార్యాచరణ చేయాలన్నారు. లేబర్‌ ఎక్కువమందింని వినియోగించి, పనులు వేగవంతం చేయాలని ఆయన అన్నారు. వచ్చే వర్షాకాలం దృష్టిలో పెట్టుకొని అప్రోచ్‌ రహదారి, పనులకు ఆటంకాలు కలగకుండా ముందస్తు పనులు పూర్తి చేయాలన్నారు. అనంతరం ఐడిఓసి వెనుక ప్రాంతంలో నిర్మిస్తున్న సోలార్‌ షెడ్‌ నిర్మాణ పనులను పరిశీలించి పనులను వేగవంతం చేసి త్వరితగతిన పూర్తి చేసి అందుబాటులోకి తేవాలని కలెక్టర్‌ అధికారులకును ఆదేశించారు. కలెక్టర్‌ వెంట నగరపాలక సంస్థ కమీషనర్‌ ఆదర్శ్‌ సురభి, శిక్షణ అసిస్టెంట్‌ కలెక్టర్‌ రాధిక గుప్తా, డి.ఆర్‌.డి.ఓ విద్యాచందన, రోడ్లు, భవనాల శాఖ ఇఇ శ్యామ్‌ ప్రసాద్‌, ఎన్నికల విభాగం సూపరింటెండెంట్‌ రాంబాబు, అధికారులు తదితరులు ఉన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు