- మేము చేసిన డిక్లరేషన్ పై అర్థరహిత విమర్శలు సరికాదు..
- దళిత ముఖ్యమంత్రి… మూడెకరాల భూమి నినాదం కాదు..
- దళిత మహిళను లాకప్ డెత్ చేయించడం అసలేకాదు..
- గిరిజనులకు 12 శాతం రిజర్వేషన్ల మోసం కూడా కాదు..
- తమ డిక్లరేషన్పై విమర్శలకు ఘాటుగా ప్రతివిమర్శలు చేసిన రేవంత్ రెడ్డి..
హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ చేవెళ్ల వేదికగా విడుదల చేసిన దళిత డిక్లరేషన్పై అధికార పక్షం చేస్తున్న విమర్శలకు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి గట్టిగా కౌంటర్ ఇచ్చారు. తమ డిక్లరేషన్ దళితుడిని సీఎం చేస్తానని మోసగించడం లాంటిది కాదని ఎద్దేవా చేశారు. దళిత సిఎంను చేస్తామని గద్దెపై కూర్చున్న వారి విమర్శలకు ప్రజలే సమాధానం చెబుతారని అన్నారు. గిరిజన జీవితాలలో గుణాత్మక మార్పునకు కన్ఫర్మేషన్ అని రేవంత్ తెలిపారు. మా డిక్లరేషన్ దళిత, గిరిజన జీవితాలలో గుణాత్మక మార్పునకు కన్ఫర్మేషన్. మా డిక్లరేషన్లో దళితుడ్ని సీఎం చేస్తానని మోసం చేయడం లాంటిది లేదన్నారు. మా డిక్లరేషన్ ప్రతి దళిత కుటుంబానికి మూడెకరాల భూమి ఇస్తానని మోసం చేయడం లాంటిది కూడా కాదని రేవంత్ అన్నారు. మా డిక్లరేషన్ గిరిజన రిజర్వేషన్లు 12 శాతం చొప్పున పెంచుతానని మోసం చేయడం లాంటిది కాదన్నారు. మా డిక్లరేషన్ మద్ధతు ధర అడిగిన గిరిజన రైతులను బందిపోట్ల కంటే ఘోరంగా బేడీలు వేసి అవమానించడం లాంటిది అంతకన్నా కాదన్నారు. మా డిక్లరేషన్ నేరెళ్ళ ఇసుక దోపిడీని ప్రశ్నించిన దళిత, బీసీ బిడ్డలపై థర్డ్ డిగ్రీ ప్రయోగించడం లాంటిది కాదన్నారు. మా డిక్లరేషన్? దళిత ` గిరిజనులకు కాంగ్రెస్ హయాంలో ఇచ్చిన అసైన్డ్ భూములను లాక్కుని రియల్ ఎస్టేట్ మాఫియాకు అమ్ముకోవడం లాంటిది అస్సులు కానేకాదన్నారు. మా డిక్లరేషన్ దళిత మహిళ మరియమ్మను లాకప్ డెత్ చేయించడం లాంటిది కాదన్నారు. మా డిక్లరేషన్ ఒకే కుటుంబంలో ముగ్గురు మంత్రి పదవులు తీసుకుని, ఒక్క మాదిగకు కూడా మంత్రి పదవి ఇవ్వకపోవడం లాంటిది కాదన్నారు. మా డిక్లరేషన్ ఎబిసిడి వర్గీకరణ చేయకుండా మోసం చేయడం లాంటిది కూడా కాదని అన్నారు. మా డిక్లరేషన్ దళితబంధు పథకంలో 30 శాతం కవిూషన్లకు కక్కుర్తిపడే రాబందుల లాంటిది కాదన్నారు. అందుకే యావత్ తెలంగాణ గుండె చప్పుడు ఒక్కటే అన్నారు. ఫైనల్గా ‘కేసీఆర్ ఖేల్ ఖతం.. బీఆర్ఎస్ దుఖాన్ బంద్‘ అనే నినాదాన్ని ఇచ్చారు..