Saturday, July 27, 2024

ఆంధ్రప్రదేశ్‌లో పడవ బోల్తా..

తప్పక చదవండి
  • తల్లి, ఇద్దరు పిల్లలు గల్లంతు
    ఆంధ్రప్రదేశ్‌లోని బాపట్ల జిల్లా నిజాంపట్నంలో విషాదం చోటు చేసుకుంది. విహారయాత్రకు వెళ్లిన ఓ కుటుంబం పడవబోల్తాతో తల్లితో పాటు ఇద్దరు చిన్నారులు గల్లంతయ్యారు. ఆదివారం నాగాయలంక మండలం ఈలచెట్లదిబ్బ నుంచి ముత్తాయపాలెం గ్రామానికి వెళ్తున్న పడవ నిజాంపట్నం వద్దకు రాగానే కెరటాల ఉద్ధృతికి బోల్తా పడింది.
    పడవలో ఉన్న తల్లి సాయివర్ణిక(25), చిన్నారులు తనీష్‌(7), తరుణేశ్వర్‌(1) గల్లంతు అయ్యారు. మరో వ్యక్తి సోంబాబు సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నారు. కాగా అతడు ఇచ్చిన సమాచారం మేరకు మెరైన్‌ సిబ్బంది గాలింపు చర్యలు మొదలు పెట్టారు.
-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు