Saturday, May 18, 2024

రాష్ట్రంలో నిరంకుశ పాలన..

తప్పక చదవండి
  • ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసును ముట్టడించిన వైనం..
  • అంబర్ పేట్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ పై నిరసన..
    హైదరాబాద్ :
    రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను, అంబర్ పేట శాసనసభ్యులు కాలేరు వెంకటేష్ నిరంకుశత్వాన్ని నిరసిస్తూ.. తక్షణమే రాష్ట్రంలోని ప్రజలకు సంక్షేమ పథకాలను అందించాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్ సెంట్రల్ జిల్లా అధ్యక్షులు డా. ఎన్. గౌతమ్ రావు ఆధ్వర్యంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించడం జరిగింది. ఈ సంధర్బంగా గౌతమ్ రావు మాట్లాడుతూ అభివృద్ కోసమని అంబర్ పేట ఎమ్మెల్యేగా కాలేరు వెంకటేష్ కు అవకాశం ఇస్తే నియోజకవర్గాన్ని ఏ మాత్రం అభివృద్ధి చెయ్యలేదని మండిపడ్డారు. ప్రభుత్వ పథకాలైన డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు , రేషన్ కార్డులు, బీసీ బందు, దళిత బంధు మొదలైనవి అర్హులైన పేదలందరికీ ఇవ్వాలని డిమాండ్ చెయ్యడం జరిగింది. అనంతరం కార్యకర్తలందరూ క్యాంప్ కార్యాలయం వైపు వెళ్లడంతో పోలీసులు అరెస్టు చేసి, అంబర్ పేట పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఈ కార్యక్రమంలో గద్వాల జిల్లా ఇంఛార్జ్ వెంకట్ రెడ్డి, నాయకులు వనం రమేష్, అజయ్, శ్యాం రాజ్, రమేష్ యాదవ్, సునీల్ తదితరులు పాల్గొన్నారు..
-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు