ఏపీ పర్యాటకశాఖ మంత్రి, సీనియర్ నటి రోజా సెల్వమని అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం ఆమె చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలుస్తున్నది. కొద్ది రోజుల కిందట కాలు బెణకడంతో ఫిజియోథెరపీ చేయించుకున్నారు. ఆమె చెన్నైలోని నివాసంలో కుటుంబసభ్యులతో ఉన్న సమయంలో శనివారం ఒక్కసారిగా కాలివాపు, నొప్పి రావడంతో అర్ధరాత్రి కుటుంబసభ్యులు అపోలో అస్పత్రికి తరలించినట్లు సమాచారం.
దీంతో పది రోజులుగా నియోజవర్గ కార్యక్రమాలకు రోజా దూరంగా ఉంటారని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని, వాపు కూడా తగ్గిందని ఆసుపత్రి వర్గాలు పేర్కొన్నాయి. త్వరలోనే రోజాను డిశ్చార్జ్ చేస్తామని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. రోజా అస్వస్థతకు గురైందనే వార్తలతో వైసీపీ కార్యకర్తలు, అభిమానులు కాస్త ఆందోళనకు గురయ్యారు. చివరికి ఆరోగ్యం బాగానే ఉందని డాక్టర్లు ప్రకటించడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. అయితే, పది రోజులుగా నియోజవర్గ కార్యక్రమాలకు రోజా దూరంగా ఉంటారని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.