Saturday, April 27, 2024

అద్వానీకి భారతరత్న పురస్కారం

తప్పక చదవండి
  • అభినందనలు తెలిపిన టిడిపి అధినేత చంద్రబాబు

అమరావతి : దేశ అత్యున్నత పౌరపురస్కారం భారతరత్న’కు ఎంపికైన మాజీ ఉప ప్రధాని, బీజేపీ కురువృద్ధుడు ఎల్‌కే అద్వానీపై అభినందనల వెల్లువ కురుస్తోంది. పలువురు రాజకీయ రంగ ప్రముఖులు ఇప్పటికే సోషల్‌ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. మాజీ సీఎం, టీడీపీ అధినేత నారా చంద్రబాబు కూడా అద్వానీకి భారతరత్నపై స్పందించారు. దేశ అత్యున్నత పౌరపురస్కారం ’భారతరత్న’కు ఎంపికైన ఎల్‌కే అద్వానీకి ఆయన అభినందనలు తెలిపారు. అద్వానీ దేశం పట్ల అంకితభావం, ఆదర్శప్రాయ కృషి చేశారని అన్నారు. పండితుడు, రాజనీతిజ్ఞుడు అయిన అద్వానీ దేశానికి అసాధారణమైన సేవలను అందించారని, ఆయనతో కలిసి పనిచేసే అవకాశం తనకు దక్కిందని అన్నారు. ఆయన ఆప్యాయత స్వభావం ప్రతి ఒక్కరిపై చెరగని ముద్రవేస్తుందని చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. ఈ మేరకు ఎక్స్‌ వేదికగా ఆయన స్పందించారు. గతంతో అద్వానీతో దిగిన ఫొటోను చంద్రబాబు షేర్‌ చేశారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు