Monday, May 13, 2024

భారత్ కు తిరిగి రానున్న వాఘ్ నాఖ్..

తప్పక చదవండి
  • ఛత్రపతి శివాజీ ఉపయోగించిన ఆయుధం..
  • భరత్ కు తిరిగి ఇచ్చేనందుకు అంగీకరించిన బ్రిటన్ ప్రభుత్వం..
  • విక్టోరియా అండ్ ఆల్బర్ట్ మ్యూజియం నుంచి తరలించే ఏర్పాట్లు..
  • వివరాలు తెలిపిన మహారాష్ట్ర మంత్రి సుధీర్ ముంగతి వార్..

న్యూ ఢిల్లీ : 1659 లో బీజాపూర్ సైన్యాధిపతి అఫ్జల్ ఖాన్‌ను అంతమొందించేందుకు మరాఠా సామ్రాట్ ఛత్రపతి శివాజీ ఉపయోగించిన ఆయుధం ‘వాఘ్‌ నాఖ్’ త్వరలో భారత్‌కు తిరిగిరానుంది. పులి గోళ్ల లాగా కనిపించినే ఈ ఆయుధాన్ని ఇనుముతో తయారు చేశారు. దీన్ని భారత్‌కు తిరిగి ఇచ్చేందుకు బ్రిటన్ ప్రభుత్వం అంగీకరించిందని మహారాష్ట్ర సాంస్కృతిక వ్యవహారాల శాఖ మంత్రి సుధీర్ ముంగతివార్ తాజాగా పేర్కొన్నారు. ప్రస్తుతం విక్టోరియా అండ్ ఆల్బర్ట్ మ్యూజియంలో ఉన్న ఈ ఆయుధాన్ని వెనక్కు తెచ్చేందుకు మంత్రి ఈ నెలలో బ్రిటన్‌కు వెళ్లి మ్యూజియం వారితో అవగాహన ఒప్పందం కుదుర్చుకోనున్నారు. ఆ ఆయుధాన్ని తిరిగిచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని బ్రిటన్ అధికారుల నుంచి తమకు లేఖ అందిందని. ఈ ఏడాదిలోనే అది భారత్‌కు చేరవచ్చు అని మంత్రి పేర్కొన్నారు. అఫ్జల్ ఖాన్‌ను శివాజీ అంతమొందించిన రోజున దీన్ని భారత్‌కు తేవాలని యోచిస్తున్నట్టు పేర్కొన్నారు. ఇందుకోసం ఇతర ముఖ్య తేదీలను కూడా పరిశీలిస్తున్నట్టు తెలిపారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు