Saturday, July 27, 2024

ఇంజనీరింగ్ హాస్టళ్ల ఆకస్మిక తనిఖీ..

తప్పక చదవండి
  • తనిఖీ చేసిన ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ శ్రీ రామ్ వెంకటేశ్..

హైదరాబాద్ : ఓయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ హాస్టళ్లను బుధవారం సాయంత్రం ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ శ్రీరామ్ వెంకటేశ్, వైస్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ చంద్రశేఖర్, అడిషనల్ ఛీఫ్ వార్డన్ ప్రొఫెసర్ మంగు, ఇంఫ్రాస్రక్షర్ డైరెక్టర్ ప్రొఫెసర్ అన్నపూర్ణ హాస్టల్ వార్డన్స్ అసోసియేట్ ప్రొఫెసర్ రమణ రావు, అసిస్టెంట్ ప్రొ. మేడి శ్రీనివాస్, అసోసియేట్ ప్రొ. శ్యామ్ సుందర్, అసిస్టెంట్ ప్రొ. విద్యా సాగర్, హాస్టల్ కేరటేకర్స్.హాస్టల్స్ లో తనిఖీలు చేపట్టారు. అక్కడ ఉన్న విద్యార్థుల సమస్యలు తెలుసుకున్నారు. హాస్టల్, మెస్ సమస్యలు సత్వరమే పరిష్కరించనునట్లు చెప్పారు. ఇప్పటికే పలుమార్లు ప్రో.శ్రీరాం వెంకటేష్ వసతి గృహాల్లో పర్యటించారు. అయిన నేరుగా విద్యార్థులతో మమేకం అవుతున్నారు. విద్యార్థులు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నా నేరుగా తమ దృష్టికి తీసుకు రావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. తమ టీమ్ విద్యార్థుల కోసం నిత్యం కృషి తోడ్పాటు ఇచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు చెప్పారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు