Saturday, May 11, 2024

రేవంత్ రెడ్డి ఇంపార్టెంట్ మీటింగ్..

తప్పక చదవండి
  • నేడు మధ్యాహ్నం వారితో సమావేశం కానున్న కాంగ్రెస్ అధ్యక్షుడు
  • వారిద్దరినీ పార్టీలోకి ఆహ్వానించనున్నట్లుగా సమాచారం
  • ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పొంగులేటి సన్నిహిత ఎమ్మెల్యేలతోను రేవంత్ భేటీ!

హైదరాబాద్, బీఆర్ఎస్ పార్టీ నుండి సస్పెన్షన్ కు గురైన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావులను కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కలవనున్నారు.
నేడు మధ్యాహ్నం వారితో సమావేశమై, పార్టీలోకి ఆహ్వానించనున్నట్లుగా తెలుస్తోంది. ఇదే సమయంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పొంగులేటి సన్నిహిత ఎమ్మెల్యేలతోను రేవంత్ భేటీ కానున్నారు. ఈ విషయమై ఇప్పటికే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తన అనుచరులకు సమాచారం ఇచ్చినట్లుగా తెలుస్తోంది.

గత కొన్ని రోజులుగా చేరికలతో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తున్న రేవంత్ రెడ్డి నేడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావులతో సమావేశం కానున్న విషయం ఆసక్తి కరంగా మారింది.. కాంగ్రెస్ పార్టీలోకి రావాలని సాధరంగా వారిని ఆహ్వానించనున్నారు. ఈ నెల 25న ఇద్దరు నేతలతో కలిసి రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్తారు. అక్కడ రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలతో పాటు కాంగ్రెస్ అగ్రనేతలతో సమావేశం అవుతారు. ఆ రోజే వారు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకుంటారు. త్వరలోనే ఖమ్మం, నాగర్ కర్నూల్లో భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేస్తారు. ఒక సభకు రాహుల్ గాంధీ, ఒక సభకు ప్రియాంక గాంధీలు ముఖ్య అతిథులుగా హాజరవుతారు.

- Advertisement -

కాగా, పొంగులేటి, జూపల్లిలను బీఆర్ఎస్ బహిష్కరించిన అనంతరం వారు బీజేపీలోకి వెళ్తారని.. కాదు కాంగ్రెస్ పార్టీలో చేరుతారనే ఊహాగానాలు వచ్చాయి. ప్రారంభంలో బీజేపీ వైపు మొగ్గు చూపినట్లుగా కనిపించింది. వారితో బీజేపీ నేత ఈటల రాజేందర్ కూడా చర్చలు జరిపారు. అయితే ఖమ్మం జిల్లాలో బీజేపీకి అంతగా పట్టు లేకపోవడంతో పొంగులేటి కాంగ్రెస్ దిశగా చూస్తున్నట్లుగా కనిపిస్తోంది. కొంత కాలం క్రితం ఈటల చేసిన వ్యాఖ్యలు కూడా దీనిని ధ్రువీకరిస్తున్నాయి. ఇక జూపల్లి గతంలో కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘకాలం ఉన్నారు. పొంగులేటితో పాటు జూపల్లి కాంగ్రెస్ లో చేరేందుకు ఆసక్తి చూపిస్తున్నారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రేవంత్ వారితో భేటీ కానున్నారని సమాచారం.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు