Sunday, May 19, 2024

కాంగ్రెస్ వైపు రాజయ్య చూపు..

తప్పక చదవండి
  • బీఎస్పీ వైపు ఓ లుక్..
  • అనుకున్నట్లుగానే రాజయ్యకు మొండిచేయి
  • భవిష్యత్ కార్యాచరణపై అభిమానులతో విస్తృత చర్చలు..

జనగామ:
ఇప్పుడు స్టేషన్‌ఘన్‌ పూర్‌ రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.. రాజయ్యకు టిక్కెట్‌ నిరాకరణతో ఆయన ఏం చేయబోతున్నారన్న ఆసక్తికర చర్చ సాగుతోంది. మొత్తంగా అంతా అనుకున్నదే జరిగింది.. మొదటి నుంచి జరిగిన ప్రచారమే నిజమైంది.. స్టేషన్‌ఘన్‌పూర్‌ నియోజకవర్గం నుంచి బీఆర్‌ఎస్‌ టికెట్‌ ఆశించిన సిట్టింగ్‌ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యకు మొండిచేయి చూపారు కేసీఆర్.. ఈ స్థానంలో మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరిని బరిలోకి దింపాలని సీఎం నిర్ణయించారు. ఈ మేరకు ఆయన అభ్యర్థుల మొదటి జాబితాలో కడియం పేరును ప్రకటించారు. దీంతో ఏ దేవుడి దయతోనైనా చివరి నిమిషంలో టికెట్‌ దక్కుతుందని ఎదురుచూసిన రాజయ్యతో పాటు, ఆయన అనుచరులకు భంగపాటు తప్పలేదు. దీంతో తీవ్ర నిరాశకు లోనైన తాటికొండ రాజయ్య భవిష్యత్‌ కార్యచరణపై దృష్టిపెట్టబోతున్నారని తెలుస్తోంది. ఇందుకోసం ఇప్పటికే రంగంలోకి దిగారని సమాచారం. ఎన్నికలు సవిూపిస్తున్న నేపథ్యంలో భవిష్యత్‌ కార్యాచరణపై సమాలోచనలు చేస్తున్నట్టు సమాచారం. కాంగ్రెస్‌ పార్టీ లేదా బీఎస్‌పీలో చేరాలంటున్నట్టు రాజయ్య వర్గీయులు చెబుతున్నారు. ఈ మేరకు హైదరాబాద్‌లోని ఎమ్మెల్యే క్యాంప్‌ కార్యాలయంలో రాజయ్య మంతనాలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. ఇదిలావుండగా జానకీపురం సర్పంచ్‌ నవ్య లైంగిక ఆరోపణల వ్యవహారం తాటికొండ రాజయ్య ఇమేజ్‌ని బాగా దెబ్బతీసింది. నవ్య ఎపిసోడ్‌ రచ్చకెక్కడం, విూడియా, సోషల్‌ విూడియాలో ప్రచారంతో ఈ వ్యవహారం అధిష్ఠానం దృష్టికెళ్లింది. ఇదే సమయంలో వ్యూహాత్మకంగా వ్యవహరించిన కడియం శ్రీహరి ఈసారి స్టేషన్‌పూర్‌ టికెట్‌ ఇస్తే గెలిపించి చూపిస్తానని హావిూ ఇవ్వడంతో బీఆర్‌ఎస్‌ అధిష్టానం కడియం వైపే మొగ్గుచూపింది. బీఆర్‌ఎస్‌ మొదటి జాబితాలో కడియం శ్రీహరి పేరు రావడమే ఇందుకు నిదర్శనం.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు