- రోడ్డు మార్గాన భారీ కాన్వాయితో ప్రయాణం..
- సోలాపూర్ లో పార్టీ కార్యక్రమానికి అటెండ్..
- తుల్జా భవానీ అమ్మవారిని దర్శించుకోనున్నకేసీఆర్
హైదరాబాద్, ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు, రేపు రెండు రోజులు మహారాష్ట్ర పర్యటనకు వెళ్లనున్నారు. ఈరోజు విఠలేశ్వరుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేయనున్నారు. రోడ్డు మార్గాన మహారాష్ట్రకు వెళ్లనున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలతో భారీ కాన్వాయ్లతో వెళతారు. సోలాపూర్ లో జరిగే పార్టీ కార్యక్రమంలో కేసీఆర్ పాల్గొంటారు. ఈ సందర్బంగా సోలాపూర్ నేత భగీరథ బాల్కే సహా పలువురు మహారాష్ట్ర నేతలు బీఆర్ఎస్ లో చేరనున్నారు. తర్వాత దారాశివ్ జిల్లాలోని శక్తిపీఠమైన తుల్జాభవానీ అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేయనున్నారు. పండరిపూర్ విటోభ రుక్మిణీ మందిర్లో సీఎం కేసీఆర్ పూజలు చేస్తారు.
ఇదీ షెద్యూల్ :
ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ ఉదయం 10 గంటలకు హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గం ద్వారానే మహారాష్ట్రకు బయలుదేరతారు. సాయంత్రం సోలాపూర్ చేరుకుంటారు. అక్కడ జరిగే పార్టీ కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ సందర్భంగా సోలాపూర్ నేత భగీరథ్ బాల్కే సహా పలువురు మహారాష్ట్ర నేతలు కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరనున్నారు. రాత్రికి అక్కడే బస చేస్తారు. ఇక రేపు ఉదయం కేసీఆర్ సోలాపూర్లోని పండరీపూర్కు చేరుకుంటారు. అక్కడ విఠోభా రుక్మిణి మందిరంలో ప్రత్యేక పూజలు చేయనున్నారు. తర్వాత దారాశివ్ జిల్లాలోని శక్తి పీఠం తుల్జాభవానీ అమ్మవారిని దర్శించుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో మళ్లీ హైదరాబాద్ తిరుగు ప్రయాణమవుతారు.