Sunday, April 28, 2024

పోలీస్ సురక్షా దినోత్సవ్

తప్పక చదవండి

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఆదివారంనాడు రాష్ట్ర పోలీసు శాఖ సురక్షా దివస్‌గా నిర్వహించింది. ఈ సందర్భంగా మహిళా భద్రతా విభాగం ఆధ్వర్యంలో మహిళా సురక్ష సంబరాలు హైదరాబాద్ లోని ట్యాంక్ బండ్ పై ఘనంగా నిర్వహించింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర హోమ్ శాఖ మంత్రి మహమూద్ అలీ, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, నగర మేయర్ గద్వాల్ విజయ లక్ష్మి, మహిళా కమీషన్ చైర్పర్సన్ సునీతా లక్ష రెడ్డి, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, డీజీపీ అంజనీ కుమార్, మహిళా భద్రతా విభాగం ఆడిషనక్ డీజీ షికా గోయల్, సినీ హీరో నాని, ప్రముఖ క్రీడాకారిణి నైనా జైస్వాల్, తదితరులు హాజరయ్యారు.

ఆదివారం నాడు సాయంత్రం జరిగిన ఈ మహిళా సురక్ష దినోత్సవ కార్యక్రమంలో మ్యూజికల్ ఆర్కెస్ట్రా, డ్రమ్స్ ప్రదర్శనలతో ఉత్సవ వాతావరణం నెలకొంది. ఈ కార్యక్రమంలో రాష్ట్రవ్యాప్తంగా వివిధ పోలీసు విభాగాల నుండి వచ్చిన మహిళా పోలీసు అధికారులు మార్షల్ ఆర్ట్ యాక్ట్‌ను ప్రదర్శించారు. కళాబృందాలు పలు జానపద సంగీతం, పాటలను ప్రదర్శించారు. ఈ సందర్భంగా షీ టీమ్స్‌ పై “కవచ్ ఫర్ ఉమెన్‌” అనే లఘు చిత్రాన్ని కూడా ఆవిష్కరించారు. ఈ సందర్బంగా పలు స్టాళ్లను ఏర్పాటు చేశారు. ఈ స్టాల్స్‌ లో, గ్రేటర్ హైదరాబాద్ రీజియన్‌లోని వివిధ ప్రదేశాలలో నిర్వహిస్తున్న గృహ హింస కౌన్సెలింగ్ కేంద్రాల ద్వారా అందిస్తున్న సేవలను అందించే ఫ్యామిలీ కౌన్సెలింగ్ స్టాళ్ళు ప్రత్యేక ఆకర్షణగా మారాయి.. వర్క్‌ ప్లేస్ ఉమెన్ సేఫ్టీపై కొత్తగా ప్రారంభించిన చొరవ, సాహస్ యొక్క స్టాల్స్ కూడా చాలామందిని ఆకర్షించింది. తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల్లోని పాఠశాల విద్యార్థులను సైబర్ అంబాసిడర్‌లుగా తీర్చిదిద్దే సైబర్ అంబాసిడర్ ప్లాట్‌ఫాం వంటి విధానాలను పౌరులు ప్రత్యక్షంగా తెలుసుకున్నారు. లైంగిక హింస నుండి బయటపడిన వారికి భరోసా కేంద్రాల ద్వారా అందుతున్న సేవలను తెలిపే స్టాల్ ను కూడా ఏర్పాటు చేశారు. అనుమానాస్పద లింక్‌లపై క్లిక్ చేయడం వల్ల కలిగే ప్రమాదాల గురించి ప్రత్యక్ష అనుభవాన్ని పొందడంతోపాటు పాస్‌వర్డ్ యొక్క ప్రాముఖ్యతను అర్థం చేసుకోవడం అలాగే బలమైన పాస్‌వర్డ్‌ లను కలిగి ఉండటం తదితర అంశాల పట్ల చైతన్య పరిచే సైబర్ స్టాల్ ను ఏర్పాటు చేశారు..

- Advertisement -

షీ షటిల్, షీ ఏవీ వాన్, షీ టాయిలెట్‌లను ప్రదర్శించిన కేంద్రాల వద్ద సెల్ఫీ తీసుకునే వారితో పెద్ద సందడిగా మారింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన రాష్ట్ర హోం శాఖా మంత్రి మహమ్మద్ మహమూద్ అలీ మాట్లాడుతూ ఇతర రాష్ట్రాలు కొన్ని దశాబ్దాలుగా సాధించలేని అభివృద్ధి తెలంగాణ దశాబ్ద కాలంలోనే సాధించగలిగామన్నారు. గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ, భరోసా కేంద్రాలకు మహిళా అభివృద్ధి , శిశు సంక్షేమ శాఖ ఎలా నిధులు సమకూరుస్తోందో, బాధితుల అభివృద్ధికి ఎలా సహాయం చేస్తుందో వివరించారు. తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ వి. సునీత లక్ష్మా రెడ్డి, హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి లు ప్రసంగిస్తూ, రాష్ట్రంలో మహిళలు, పిల్లల భద్రత, భద్రతకు భరోసా ఇవ్వడంలో మహిళా సేఫ్టీ వింగ్ యొక్క కృషిని ప్రశంసించారు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ గౌరవ ముఖ్యమంత్రి మహిళల భద్రతకు అత్యధిక ప్రాధాన్యతనిచ్చారని, ఈ సంకల్పాన్ని అమలు చేయడంలో మహిళా భద్రతా విభాగం చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. దేశంలోని ఆ ఇక రాష్ట్రాల్లో మన షీ టీమ్ లను ప్రారంభిస్తున్నారని అన్నారు. డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అంజనీ కుమార్ ప్రసంగిస్తూ, తెలంగాణ మానవాభివృద్ధి సూచికలలో అద్భుతమైన అభివృద్ధిని ప్రస్తావిస్తూ ఇది కేవలం శాంతి భద్రతల పరిరక్షణతోనే సాధ్యమైందని పేర్కొన్నారు..

ప్రజల భద్రత, భద్రతపై భరోసా తదితర అంశాలే రాష్ట్రం సాధించిన విజయాలను ప్రత్యక్షంగా సూచిస్తున్నాయని పేర్కొన్నారు. ఉమెన్ సేఫ్టీ వింగ్ యొక్క కృషిని డీజీపీ ప్రశంసిస్తూ, మహిళలు, పిల్లలు రాష్ట్ర శ్రేయస్సుకు భద్రతా కీలకమని, షీ టీమ్స్, సాహస్ భరోసా సెంటర్లు, సి.డీ.ఈ.డబ్ల్యు ఫ్యామిలీ కౌన్సెలింగ్ సెంటర్లు వంటి విభాగాలు వారిలో స్తైర్యాన్ని కల్పిస్తున్నాయని అన్నారు. అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఉమెన్ సేఫ్టీ వింగ్ షికా గోయల్ మాట్లాడుతూ, రాష్ట్రంలో పోలీసింగ్ యొక్క పదేళ్ల ప్రయాణం చాలా అసాధారణమైన అనుభవంగా పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 331 షీ టీమ్ లున్నాయని తెలిపారు. “మహిళలకు భద్రత, అందరికీ శ్రేయస్సు” అనే పేరుతో ఒక షార్ట్ మూవీని షికా గోయల్ ఈ సందర్బంగా విడుదల చేశారు. ఇందులో, ఉమెన్ సేఫ్టీ వింగ్ అమలు చేస్తున్న వివిధ జోక్యాలు, కార్యక్రమాలున్నా దుర్బలత్వాన్ని తగ్గించడం, సానుభూతి, మానవతా దృక్పథంతో, మహిళల భద్రత కల్పించడానికి రాష్ట్రంలో పోలీసింగ్ వ్యూహంలో ప్రదానంగా కొనసాగుతుందని పేర్కొన్నారు. మహిళా భద్రతా విభాగంతో విద్యాశాఖ ల మధ్య సహకారంతో ప్రభుత్వ పాఠశాలల్లో నిర్వహిస్తున్న సైబర్ అంబాసిడర్ ప్లాట్‌ఫారమ్ వంటి కార్యక్రమాలు సమాజంలో సైబర్ నేరాలకు గురయ్యే ప్రమాదాన్ని తగ్గించడంలో ప్రభావవంతంగా ఉన్నాయని ఆమె ఈ సందర్భంగా, భరోసా, షీ టీమ్స్‌ లపై బ్రోచర్, ఎస్.ఓ.పీ. లను విడుదల చేశారు. మహిళలపై నేరాలను పరిశోధించే విధానాలతో కూడిన పుస్తకాన్ని హోమ్ మంత్రి మహమూద్ అలీ తోపాటు, డీజీపీ అంజనీ కుమార్, రచయిత డా. వసంత్, ఏడీజీ శిఖా గోయెల్‌ కూడా విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి అనూప్ రూబెన్స్, నాని (ఘంటా నవీన్ బాబు), నైనా జైస్వాల్ వంటి సెలెబ్రెటీలు హాజరవడం పట్ల ఈవెంట్‌లకు ఉత్సాహాన్నికలిగించించింది.. ఈ సందరబంగా బుద్ధ విగ్రహం వద్ద నుండి బాణసంచా ప్రదర్శన, వాణిశ్రీ బ్యాండ్, దామిని భట్ల బృందం ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా మారాయి. ఈ కార్యక్రమానికి అడిషనల్ డీజీ లు సందీప్ శాండిల్య, సంజయ్ కుఆర్ జైన్, అభిలాష బిస్ట్, మహేష్ భగవత్, నగర పోలీస్ కమీషనర్ సీవి ఆనంద్, .మహిళా శిశు సంక్షేమ శాఖ కమీషనర్ భారతి హోలికెరీ, మహిళలు, చిన్నారులతో సహా వేలాది మంది ప్రజలు ఈ వేడుకలకు హాజరయ్యారు. అనూప్ రూబెన్స్ పాటలతో ఉత్సాహాన్ని నింపారు..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు