పాకిస్థాన్ పేస్ బౌలర్ షాహీన్ అఫ్రిదీ తన స్పీడ్తో దుమ్మురేపినా.. టీ20 విటాలిటీ బ్లాస్ట్ టోర్నీలో తన జట్టు నాటింగ్హామ్ షైర్ను గెలిపించలేకపోయాడు. తొలుత బ్యాటింగ్ చేసిన నాటింగ్హామ్షైర్ నిర్ణీత ఓవర్లలో 168 రన్స్ చేసింది. అయితే 169 రన్స్ టార్గెట్తో బరిలోకి దిగిన బర్మింగ్హామ్ బియర్స్ జట్టుకు తొలి ఓవర్లోనే భారీ షాక్ తగలింది. నాటింగ్హామ్ బౌలర్ షాహీన్ అఫ్రిది తన తొలి ఓవర్లోనే నాలుగు వికెట్లును ఖాతాలో వేసుకున్నాడు. ఓపెనర్ అలెక్స్ డేవిస్(0), క్రిస్ బెంజిమన్(0), డాన్ మౌజ్లే(1), ఎడ్ బెర్నార్డ్(0) వికెట్లను తీసుకున్నాడు. కానీ మరో ఓపెనర్ రాయ్ యేట్స్ విరోచిత ఇన్నింగ్స్ ఆడాడు. యేట్స్ 46 బంతుల్లో 65 రన్స్ చేశాడు. దీంతో మరో 5 బంతులు ఉండగానే బర్మింగ్హామ్ జట్టు లక్ష్యాన్ని అందుకున్నది.