Thursday, May 2, 2024

నారా భువనేశ్వరి జన్మదిన వేడుకలు..

తప్పక చదవండి

హైదరాబాద్, తెలుగు దేశం పార్టీ జాతీయ అద్యక్షలు నారా చంద్రబాబు నాయుడు సతీమణి, ఎన్టీఆర్ ట్రస్ట్ చెర్మన్‌ నారా భువనేశ్వరి జన్మదినం సందర్బంగా మంగళవారం రోజు మహబూబాబాద్ జిల్లా, గూడూరు మండల కేంద్రంలోని ప్రభుత్వ హస్పటల్ లో ఎన్టీఆర్ ట్రస్ట్ నుండి 50 లక్షల రుపాయలతో నిర్మించిన ఆక్షిజన్ ప్లాంట్ వద్ద కొండపల్లి రామచందర్ రావు, టిడిపి పార్లమెంట్ అధ్యక్షులు మహబాద్‍ ఆద్వర్యంలో పార్టీ నాయకులతో కలసి కేక్ కట్‌ చేసి, భువనేశ్వరి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించి, శుభాకాంక్షలు తెలియ జేశారు.. అనంతరం హస్పటల్ లో రోగులకు బ్రెడ్లు‌, పండ్లు పంపిణీ చేశారు.. ఈ సందర్బంగా రామచందర్ రావు మాట్లాడుతూ గిరిజన ప్రాంతమైన మహబూబాబాద్‍ లో కరోన సమయంలో హస్పటల్ల‌లో ఆక్సిజన్ కొరతతో ఇబ్బంది పడుతున్న తరుణంలో ఎన్టీఆర్ ట్రస్టు నుండి తెలంగాణలోనే ప్రదమంగా 50 లక్షల రుపాయలతో ఆక్సిజన్‌ ప్లాంట్‌ మంజూరు చేసి, వెంటనే నిర్మించి ఎంతో మంది ప్రాణాలను నారా చంద్రబాబునాయుడు, నారా భవనేశ్వరి కాపాడరని తెలిపారు. ఈ కార్యక్రమంలో హస్పటల్ సూపరెండెంట్‌ డా. వీరన్న, టిడిపి రాష్ట్ర మహిళ అధికార ప్రతినిధి కొండపల్లి రామచంద్రమ్మ, ఎం.పీ.టి.సి. గూడూరు, మహబూబాబాద్‍ మండల పార్టీ అద్యక్షలు నాయిని నరేందర్‌, కారింగుల శ్రీనివాస్‌, టిడిపి పార్లమెంట్ కార్యదర్శి ప్రెమ్ చంద్‍ వ్యాస్, శ్రీను, బోడ బద్రు పాల్గొన్నారు..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు