Sunday, May 19, 2024

వైరా మునిసిపాలిటీ లో 7, 8 వార్డులలో పర్యటించిన బాణోత్ మదన్ లాల్..

తప్పక చదవండి

హైదరాబాద్, వైరా మున్సిపాలిటీ పరిధిలోని 7,8 వార్డులలో మంగళవారం వైరా మాజీ శాసనసభ్యులు బాణోత్ మదన్ లాల్ పర్యటించారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరినీ పలకరిస్తూ పర్యటించిన మదన్ లాల్ అనారోగ్యం తో బాధ పడుతున్న పలువురుని పరామర్శించారు.. 8 వార్డు అశోక్ కు కాలు విరిగిన విషయం తెలుసుకుని అక్కడికి వెళ్ళి అశోక్ కు పరామర్శించారు. 8 వార్డులో యండ్రతి గోపాలరావు ఇంటి వద్ద తేనేటి విందులో పాల్గొన్నరు. వార్డులలో ప్రతి ఒక్కరిని ఆప్యాయతగా పలుకరిస్తూ వారి వద్దకు వెళ్లి కలిసి పలు విషయాలు అడిగి తెలుసుకున్నారు. పలుచోట్ల మదన్ లాల్ మాట్లాడుతూ.. కేసీఆర్ సంక్షేమ పథకాల గురించి వివరిస్తూ ఉమ్మడి రాష్ట్రంలో ఎన్నో ఇబ్బందులు పడ్డాం.. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ సారధ్యంలో సంక్షేమ పథకాలు అమలు అంటే కేరప్ తెలంగాణ రాష్ట్రం అని పలు రాష్ట్రాల ప్రజలు చెప్పుకుంటన్నరు అని అన్నారు. మదన్ లాల్ కు ప్రతి ఒక్కరు ఇంటి బయటకు వచ్చి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో తన్నీరు నాగేశ్వరరావు, యండ్రతి గోపాలరావు, యండ్రతి ఉపేందర్, రవీందర్, 5 వార్డు కౌన్సిలర్ మాదినేని సునీత, తన్నీరు జ్యోతి, తాతా నిర్మల, దోంతేబోయన వెంకటేశ్వర్లు, మాదినేని దుర్గా ప్రసాద్, కొత్తా వెంకటేశ్వరరావు, మేడురి రామారావు, నల్లబోలు వెంకట రెడ్డి, తన్నీరు కిషోర్, మేదరమెట్ల వెంకటేశ్వరరావు, మేదరమెట్ల రాము, గుజ్జర్లపుడి దేవ రాజు, మొల దుర్గా, కరుకొండ బోస్, నల్లమోతు లక్ష్మి నారాయణ, తోటకూర వీరబాబు, నల్లగొండ నాని తదితరులు పాల్గొన్నారు..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు