Saturday, May 11, 2024

మాఫియా కింగ్‌ కేసీఆర్‌..

తప్పక చదవండి
  • జంట నగరాల విధ్వంసానికి కుట్ర చేస్తున్నాడు..
  • భారీ భూ కుంభకోణానికి తెరతీశాడు..
  • జీఓ 111 రద్దు చేయడం జంట నగరాలపై బాంబువెయ్యడమే..
  • విలేఖరుల సమావేశంలో విరుచుకుపడ్డ రేవంత్‌ రెడ్డి

హైదరాబాద్‌ : కేసీఆర్‌ మాఫియా వ్యవవస్థను ఏర్పాటు చేసుకున్నాడని మండిపడ్డారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి. ధనదాహం కోసమే 111 జీవో రద్దు చేసి..జంట నగరాలపై బాంబు వేశాడని ఘాటైన వ్యాఖ్యలు చేశారాయన. సీఎం కేసీఆర్‌ హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ నగరాలు విధ్వంసం చేసేందుకు కుట్ర పన్నాడన్నారు. ఈ విధ్వంసం వెనుక భారీ భూ కుంభకోణం ఉందన్నారు రేవంత్‌ రెడ్డి. మే 22వ తేదీ సోమవారం హైదరాబాద్‌ లోని పార్టీ ఆఫీస్‌ గాంధీభవన్‌ లో మీడియాతో మాట్లాడారు. సీఎం కేసీఆర్‌, ఆయన బినామీల కోసమే 111జీవోను రద్దు చేశారన్నారు. కేసీఆర్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన భూ లావాదేవీలను బహిరంగ పర్చాలని డిమాండ్‌ చేశారు. పీజేఆర్‌ పోరాటం వల్లే కృష్ణా జలాలు హైదరాబాద్‌ కు వచ్చాయన్నారు రేవంత్‌ రెడ్డి. కాంగ్రెస్‌ హయాంలో గోదావరి జలాలు హైదరాబాద్‌ సిటీకి వచ్చాయని వివరించారాయన. హైదరాబాద్‌ సిటీ దాహం తీర్చిన జంట జలాశయాలు ఉస్మాన్‌ సాగర్‌, హిమాయత్‌ సాగర్‌ లను నాశనం చేస్తారా అని ప్రశ్నించారాయన. గతంలోనే రూపాయి ఖర్చు లేకుండా పైపు లైన్లు వేశామన్న కేసీఆర్‌.. ఇప్పుడు పైపుల కంపెనీల దగ్గర కమిషన్ల కోసమే కొత్త నాటకానికి తెరలేపారని మండిపడ్డారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు