- కొల్హాపూర్ అమ్మవారిని దర్శించుకోనున్న కేసీఆర్..
- ఈ సాయంత్రం తిరిగి హైదరాబాద్ కు రాక..
తెలంగాణ ముఖ్యమంత్రి, భారత రాష్ట్ర సమితి పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నేడు మహారాష్ట్ర పర్యటనకు వెళ్లనున్నారు. సిఎం కేసీఆర్ ఒక రోజు మహారాష్ట్రలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా కొల్హాపూర్లో అమ్మవారిని సిఎం కేసీఆర్ దర్శించుకోనున్నారు. ఆ తర్వాత అన్నా బాహు సాటే విగ్రహం వద్ద కేసీఆర్ నివాళులర్పించనున్నారు. అనంతరం కేసీఆర్, సాహు మహారాజ్ సమాధిని సందర్శించనున్నారు. సాయంత్రం కేసీఆర్ తిరిగి హైదరాబాద్ చేరుకోనున్నారు.