Saturday, July 27, 2024

మోడీకి ఇక విదేశాలే గతి..

తప్పక చదవండి
  • ఓటమి తప్పదు అక్కడ స్థిరనివాసం తప్పదు..
  • ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన ఆర్.జె.డీ. అధ్యక్షుడు లాలూ ప్రసాద్‌..

బీహార్‌ మాజీ సీఎం, రాష్ట్రీయ జనతా దళ్‌ (ఆర్జేడీ) అధ్యక్షుడు లాలూ ప్రసాద్‌ యాదవ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఓడిన తర్వాత ప్రధాని మోదీ విదేశాల్లో స్థిరపడతారని అన్నారు. ప్రతిపక్షాల కూటమి ’ఇండియా’పై ప్రధాని మోదీ ఇటీవల పలు విమర్శలు చేశారు. ఆ కూటమిని ’క్విట్‌ ఇండియా’గా అభివర్ణించారు. మోదీ చేసిన ఈ వ్యాఖ్యలపై స్పందించాలని లాలూ ప్రసాద్‌ యాదవ్‌ను విూడియా కోరింది. దీనికి ఆయన తనదైన రీతిలో బదులిచ్చారు. దేశాన్ని వీడే ఆలోచనలో మోదీనే ఉన్నారని, అందుకే ఆయన విదేశాల్లో తిరుగుతున్నారని విమర్శించారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఓడిపోతామన్న భయంలో ప్రధాని మోదీ ఉన్నారని లాలూ ప్రసాద్‌ యాదవ్‌ అన్నారు. అందుకే ఆయన విదేశాల్లో ఏకాంత స్థలం కోసం చూస్తున్నారని తెలిపారు. పిజ్జాలు, మోమోలు, చౌవిూన్‌లు ఆస్వాదించే ప్రాంతం కోసం ఆయన వెతుకుతున్నారని ఎద్దేవా చేశారు. పెద్ద కుమారుడు, బీహార్‌ మంత్రి తేజ్‌ ప్రతాప్‌ యాదవ్‌ ఆదివారం ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో లాలూ ప్రసాద్‌ యాదవ్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా విూడియా అడిగిన పలు ప్రశ్నలకు తనదైన చమత్కార ధోరణిలో ఆయన సమాధానాలిచ్చారు. దీంతో అక్కడున్న వారంతా నవ్వుకున్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు