Friday, May 17, 2024

కేసీఆర్‌ పవర్‌ఫుల్‌ లీడర్‌

తప్పక చదవండి
  • సీఎం కేసీఆర్‌ను కొనియాడిన గవర్నర్‌
  • రాజ్‌భవన్‌కు, ప్రగతి భవన్‌కు దూరం లేదు
  • బిల్లుల ఆమోదంలో రాజకీయం లేదని వెల్లడి
  • తనదారి తనదేనని తమిళిసై వ్యాఖ్యలు
  • తెలంగాణ గవర్నర్‌గా నాలుగేళ్లు పూర్తి
    హైదరాబాద్‌ : తెలంగాణ గవర్నర్‌గా తమిళసై నాలుగేళ్లు పూర్తి చేసుకుని ఐదో ఏట అడుగుపెట్టారు. తెలంగాణ ప్రజలతో తన బంధం పెరిగిందని ఈ సందర్భంగా అన్నారు. అలాగే రాజ్‌భవన్‌కు ప్రగతి భవన్‌కు మధ్య దూరం లేదని కూడా వ్యాఖ్యానించారు. బిల్లుల ఆమోదంలో కూడా ఎలాంటి రాజకీయాలు చేయలేదన్నారు. న్యాయపరంగా ఆలోచించిన నిర్ణయాలు తీసుకుంటానని అన్నారు. ఈ క్రమంలో గవర్నర్‌ తమిళిసై, కేసీఆర్‌ ప్రభుత్వం మధ్య బంధం మరికాస్త గట్టిపడినట్లు తెలుస్తోంది. శుక్రవారం రాజ్‌భవన్‌లో సీఎం కేసీఆర్‌పై వర్నర్‌ చేసిన పొగడ్తలే ఇందుకు నిదర్శంగా నిలిచాయి. ఇటీవల నూతన సచివాలయంలో గవర్నర్‌కు సీఎం కేసీఆర్‌ సాదరస్వాగతం పలికిన విషయం తెలిసిందే. ఇప్పుడు తాజాగా సీఎం కేసీఆర్‌ను గవర్నర్‌ పొగడ్తలతో ముంచెత్తారు. నాలుగేళ్లు పూర్తి చేసుకొని ఐదవ ఏటా అడుగుపెడుతున్న సందర్భంగా శుక్రవారం రాజ్‌భవన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో.. ముఖ్యమంత్రి కేసీఆర్‌పై తమిళసై పొగడ్తల వర్షం కురిపించారు. కేసీఆర్‌ ఎంతో అనుభవం, ముందు చూపు ఉన్న నాయకులు అంటూ ఆకాశానికి ఎత్తేశారు. ఎమ్మెల్యేల కొనుగోలు అంశంలో అప్పట్లో తన ఫోన్‌ ట్రాప్‌ చేసారని కామెంట్స్‌ చేసింది వాస్తవమన్నారు. కొద్దిగా మిస్‌ కమ్యూనికేషన్‌ వల్ల అలాంటి వ్యాఖ్యలు జరుగుతాయని… తాను తెలుసుకోవడానికి చాలా సమయం పట్టిందని గవర్నర్‌ తమిళిసై చెప్పుకొచ్చారు. గవర్నర్‌గా తాను రాజకీయాలు చేయలేదని ప్రజలకు సేవ చేసేందుకే ప్రయత్నించానని తమిళిసై తెలిపారు. తెలంగాణ గవర్నర్‌గా ఉన్న తనపై.. ఇక్కడి ప్రజలు చూపించిన ప్రేమ, అభిమానాలకు ధన్యవాదాలు తెలిపారు. తాను ఎక్కడ ఉన్నా తెలంగాణతో బంధం మరిచిపోనని.. సవాళ్లకు, పంతాలకు భయపడే వ్యక్తిని కానని గవర్నర్‌ తెలిపారు. బాధ్యతలు, విధులను సమర్థవంతగా నిర్వర్తిస్తూ.. తెలంగాణలో గవర్నర్‌గా నాలుగేళ్ల కాలం పూర్తి చేసుకున్నానని సంతృప్తి వ్య్కతం చేశారు. అలాగే కోర్టు కేసులకు, విమర్శలకు భయపడబోనన్నారు. ప్రొటోకాల్‌ ఉల్లంఘనతో తనను కట్టడి చేయలేరని తెలంగాణ ప్రజలకు సేవ చేయడానికి వచ్చా.. ప్రజల విజయమే విజయమని తమిళిసై వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రభుత్వంతో వివాదం పెట్టుకునే ఉద్దేశం.. కొట్లాడే ఉద్దేశం లేదన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ సీనియర్‌ లీడర్‌.. పవర్‌ ఫుల్‌ నేత. నాలుగేళ్లుగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ పాలన నేను చూస్తున్నా. రాజ్‌భవన్‌కి, ప్రగతి భవన్‌కు గ్యాప్‌ లేదు. సీఎంతో ఎలాంటి దూరం లేదు. దూరం గురించి నేను పట్టించుకోను… తన దారి తనదేనన్నారు. ప్రజలకు ఎంతో సేవ చేయాలని ఉంది కానీ గవర్నర్‌ ఆఫీస్‌కు కొంత లిమిట్‌ ఉందని తమిళి సై గుర్తు చేశారు. నిధుల కొరత కూడా ఉందన్నారు. ప్రజలకు సేవ చేయడం తప్ప..పొలిటికల్‌ ఎజెండా లేదన్నారు. తనది మోసం చేసే తత్వం కాదని స్పష్టం చేశారు. తెలంగాణ బర్త్‌ డేనా బర్త్‌ డే ఒకేరోజు. నా మైండ్‌ లో ఎప్పుడూ ప్రజలకు సేవ చేయాలనే ఉంటుందన్నారు. తాను నిరంతరం సంతోషంగా ఉండే వ్యక్తినన్నారు. పుదుచ్చేరికి కూడా గవర్నర్‌ గా ఉన్నా.. తెలంగాణ ప్రజల కోసం ఎక్కువ టైం స్పెండ్‌ చేస్తున్నా. అడ్మిస్టేషన్‌ పరంగా రెండు రాష్టాల్రకూ నా బాధ్యత నిర్వర్తిస్తున్నా. ఇక్కడ జిల్లాలకు వెళ్తే ఐఏఎస్‌ అధికారులు రారు. కానీ, పుదుచ్చేరిలో సీఎస్‌ సహా చాలా మందిని పర్యవేక్షిస్తున్నాను. నాకు గౌరవం ఇస్తారా.. నా పనిని గుర్తిస్తారా? అనేది నాకు అవసరం లేదని స్పష్టం చేశారు. ఆర్టీసీ బిల్లుపై అనవసర కాంట్రవర్సీ జరిగింది. నేను ఆర్టీసీ కార్మికుల లబ్దికోసమే బిల్లుపై ప్రభుత్వాన్ని ప్రశ్నించాను. గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీ అనేది కేటగిరి ఉంటుంది. గవర్నర్‌ కోట ఎమ్మెల్సీలపై ప్రభుత్వం కేటగిరి పూర్తిగా స్పష్టత ఇవ్వలేదు. గవర్నర్‌ కోట ఎమ్మెల్సీ అనేది పొలిటికల్‌ నామినేషన్‌ కాదు. గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీ కి అర్హత ఉందనిపిస్తే.. సంతకం చేయడానికి ఎలాంటి ఇబ్బంది లేదన్నారు. మెడికల్‌ కాలేజీల వ్యవహారంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వివాదం జరిగింది. కేంద్ర` రాష్ట్ర ప్రభుత్వాల మధ్య మంచి సంబంధాలు ఉండాలి. మెడికల్‌ కాలేజీలు ఇవ్వడానికి కేంద్రం అడిగిన సమయంలో రాష్ట్రం స్పందించలేదనే విషయాన్ని కేంద్రం చెప్పింది. తెలంగాణ రాష్ట్రానికి కూడా మెడికల్‌ కాలేజీలు కేంద్రం ఇచ్చిందన్నారు.
-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు