థాయ్లాండ్ ఓపెన్లో భారత షట్లర్ల జోరు కొనసాగుతున్నది. అంతర్జాతీయ స్థాయిలో అంతగా అనుభవం లేకపోయినా కిరణ్ అద్భుతంగా రాణిస్తున్నాడు. గురువారం జరిగిన పురుషుల సింగిల్స్లో కిరణ్ 21-11, 21-19 తేడాతో వెంగ్హాంగ్ యాంగ్(చైనా)పై అద్భుత విజయం సాధించాడు. 39 నిమిషాల్లోనే ముగిసిన పోరులో కిరణ్ వరుస గేముల్లో ప్రత్యర్థిని చిత్తుచేశాడు.
మరో సింగిల్స్లో లక్ష్యసేన్ 21-17, 21-15 తో లీ షీ ఫెంగ్(చైనా)పై అలవోక విజయం సాధించాడు. 49 నిమిషాల్లో నాలుగో సీడ్ ఫెంగ్ను ఓడించిన సేన్ ముందంజ వేశాడు. మహిళల సింగిల్స్లో సైనా నెహ్వాల్ 11-21,14-21తో హీ బింగ్జియావో(చైనా) చేతిలో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించింది. పురుషుల డబుల్స్లో సాత్విక్సాయిరాజ్, చిరాగ్శెట్టి 26-24, 11-21, 21-17తో మహమ్మద్ షాబిల్, బాగస్ మౌలానా జోడీపై గెలిచి ముందంజ వేశారు.