Saturday, July 27, 2024

సచివాలయంలో మూడు ప్రార్థనాలయాలు

తప్పక చదవండి

ఆగస్ట్‌ 25న ప్రారంభానికి ముహూర్తాలు.. ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో సీఎం కేసీఆర్‌

హైదరాబాద్‌ : సర్వ మత సమానత్వాన్ని కొనసాగిస్తూ, లౌకికవాద స్ఫూర్తి ప్రతిఫలించే విధంగా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కీలక నిర్ణయం తీసుకున్నారు. డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో నిర్మాణం పూర్తి చేసుకున్న నల్ల పోచమ్మ దేవాలయం, మసీదు, చర్చీలను ఒకే రోజున ప్రారంభించాలని నిర్ణయించారు. ఈ మేరకు ఆయా మతపెద్దలను సంప్రదించి అందరికీ ఆమోదయోగ్యమైన తేదీని ఖరారు చేశారు. ఆగస్టు 25వ తేదీన హిందూ సాంప్రదాయాలను అనుసరించి పూజారుల సమక్షంలో నల్ల పోచమ్మ విగ్రహ ప్రతిష్ఠాపన చేసి దేవాలయాన్ని సీఎం పునః ప్రారంభిస్తారు. అదే రోజున ఇస్లాం, క్రిస్టియన్‌ మతాల సాంప్రదాయాలను అనుసరించి ఆయా మత పెద్దల ఆధ్వర్యంలో మసీదును, చర్చీలకు ప్రారంభోత్సవం చేయనున్నారు. ఈ మేరకు మంత్రులు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, సీఎంఓ అధికారులు, ఆర్‌అండ్‌బీ ఆధికారులతో ఉన్నత స్థాయి సవిూక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హిందూ, ముస్లిం, క్రిస్టియన్‌ మతాల పెద్దలతో సంప్రదించి ఒకే రోజున మూడు మతాల ప్రార్థనా మందిరాలను ప్రారంభించే చారిత్రక నిర్ణయాన్ని సీఎం తీసుకున్నారు. తద్వారా సచివాలయ ఉద్యోగులకు ఈ మూడు ప్రార్థనా మందిరాలు అందుబాటులోకి రానున్నాయి.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు