Friday, May 3, 2024

ఏజెన్సీలో అడ్డగోలుగా అక్రమ నిర్మాణాలు

తప్పక చదవండి
  • పట్టించుకోని సంబంధిత అధికారులు

లక్ష్మీదేవిపల్లి : ఏజెన్సీ ఏరియాలో అడ్డగోలుగా అక్రమ నిర్మాణాలు చేపడుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఏజెన్సీ పరిరక్షణ కమిటీ సభ్యులు స్థానిక పంచాయతీ అధికారులపై శుక్రవారం ఆగ్రహం వ్యక్తం చేశారు. మండల పరిధిలోని బడాబాబులకు మూడు,నాలుగు బహుళ అంతస్తులు నిర్మిస్తు న్నారు. అయితే ఈనిర్మాణాలకు ఎటువంటి అనుమతి లేదు. పంచాయతీ అధికారుల అనుమతి అసలే లేకపోవడం గమనార్హం. పంచాయతీ అధికా రుల అనుమతి లేకుండా బహుళ అంతస్తులు నిర్మిస్తున్నారంటే దీని వెనుక ఎవరిహస్తం ఉందని కమిటీ సభ్యులు ప్రశ్నిస్తున్నారు. పంచాయతీ అధికారులు బహుళ అంతస్తులు నిర్మించవద్దని ప్రభుత్వం నుంచి నోటీసులు పంపించినా అక్రమ నిర్మాణ పనులు కొనసా గిస్తున్నారని స్థానిక ప్రజలు ముక్తకంఠంతో చెబుతున్నారు. మండలంలో అనుమతి లేకుండా ఎక్కడ అక్రమనిర్మాణాలు చేపట్టినా పంచాయతీ కార్యదర్శులు నోటీసులు పంపిస్తున్నారు, నోటీసులు అందుకున్న అక్రమ నిర్మాణదారు లకు మండల పంచాయతీ అధికారులు అండగా ఉంటున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఏజెన్సీ ప్రాంతంలో అనుమతి లేకుండా అక్రమ కట్టడాల నిర్మాణాలు చేపడుతుంటే అధికారులు నిద్రమత్తులో ఉన్నారా అంటూ గిరిజన నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అక్రమ నిర్మాణాల వ్యవహా రంలో ప్రభుత్వ నిబంధనలను బడాబాబులు ఏమాత్రం పట్టించుకోవడం లేదని, సర్పంచ్‌ నుంచి మొదలు మండలస్థాయి అధికారుల వరకు వారికి భారీగా ముడుపులు చేరుతున్నా యని ఆరోపిస్తున్నారు. ఈకారణంగానే అక్రమ నిర్మాణాలను అధికారులు పట్టించుకోవడం లేదనే వాదనలు వినిపిస్తోంది. మండల స్థాయి అధికారులు, జిల్లా అధికారులు వారికి కొమ్ముకాస్తున్న కారణంతో పంచాయతీ కార్యదర్శులు కేవలం నోటీసులు ఇవ్వడం తప్ప ఇంకెటువంటి చర్యలు తీసుకునే సాహసం చేయలేకపోతున్నారు. అక్రమాలను,దందాలను అడ్డుకోవాల్సిన అధికారులే ఇలా ముడుపులకు అలవాటు పడితే వాటికి అడ్డుకట్టు వేసేది ఎవరని ప్రశ్నిస్తున్నారు. అటు లక్ష్మీదేవిపల్లి పంచాయతీ ఆఫీసుకు ఇటు లక్ష్మీదేవిపల్లి ఎంపిడిఓ ఆఫీస్‌కు మధ్యలో అనుమతి లేకుండా పాత బిల్డింగ్‌ పైనే బహుళ అంతస్తుల నిర్మాణం జరుగుతుంటే పట్టించుకోకుండా ఎంపిఓ ఏం చేస్తున్నారనేది అంతుచిక్కని ప్రశ్నగా మిగిలింది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు