Tuesday, May 14, 2024

శ్రద్ధగా చదువుకుంటే భవిష్యత్తు ఉంటుంది. మంత్రి మల్లారెడ్డి

తప్పక చదవండి

మేడ్చల్‌ : నాలుగు సంవత్సరాల పాటు కాలాన్ని వృధా చేయకుండా శ్రద్ధగా చదువుకుంటే ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని నూతనంగా సిఎంఆర్‌ ఐటీ కళాశాలలో చేరిన విద్యార్థులకు మంత్రి మల్లారెడ్డి సూచించారు.శుక్రవారం సీఎంఆర్‌ ఇంజనీరింగ్‌ టెక్నాలజీ కళాశాలలో జరిగినటువంటి ఓరియంటేషన్‌ డే కార్యక్రమానికి మంత్రి మల్లారెడ్డి ముఖ్యఅతిథిగా విచ్చేసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ సీఎంఆర్‌,మల్లారెడ్డి విద్యాసంస్థల్లో విద్యనభ్యసించిన వారు దేశంలోనే కాదు ప్రపంచంలో కూడా పేరుగాంచిన పరిశ్రమల్లో ఉద్యోగాలు సాధించారని మంత్రి మల్లారెడ్డి తెలిపారు. నాలుగు సంవత్సరాల పాటు విద్యార్థులు కాలాన్ని వృధా చేయకుండా చదువుపై శ్రద్ధ వహించి ఉంటే భవిష్యత్తు బంగారు మయంగా ఉంటుందని మంత్రి మల్లారెడ్డి విద్యార్థులకు చెప్పారు. కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్‌ జంగారెడ్డి,ప్రిన్సిపల్‌ శ్రీనివాస్‌, సీఎంఆర్‌ విద్యాసంస్థల డైరెక్టర్‌ గోపాల్‌ రెడ్డి,శ్రీశైలం రెడ్డి, హెచ్‌ఓడిలు,ఉపాధ్యాయులు, విద్యార్థులు తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు..

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు