Friday, April 26, 2024

నేను చేసింది కొంతే..

తప్పక చదవండి
  • ఇంకా చేయాల్సింది ఎంతో ఉంది..
  • సంస్కరణలు అనేవి నిరంతర ప్రక్రియ..
  • కులమతాలకు అతీతంగా సంక్షేమ ఫలాలు..
  • కరోనా, నోట్ల రద్దుతో కోలుకోలేని దెబ్బ..
  • అందుబాటులోకి మంచిర్యాల సవిూకృత కలెక్టరేట్‌..
  • మంత్రుల సమక్షంలో ప్రారంభించిన సిఎం కెసిఆర్‌..
  • బిఆర్‌ఎస్‌ కార్యాలయానికి కూడా ప్రారంభోత్సవం..

హైదరాబాద్,మంచిర్యాల జిల్లా కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన సవిూకృత జిల్లా కార్యాలయాల సముదాయంను ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టరేట్‌ శిలాఫలకాన్ని కేసీఆర్‌ ఆవిష్కరించారు. నూతన కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రత్యేక పూజల్లో కేసీఆర్‌ పాల్గొన్నారు. అంతకుముందు పోలీసుల గౌరవ వందనాన్ని కేసీఆర్‌ స్వీకరించారు. రూ.1,748 కోట్లతో చెన్నూర్‌, పర్దాన్‌పల్లి లిప్ట్‌ ఇరిగేషన్‌ పథకాలకు, రూ.510 కోట్లతో మెడికల్‌ కాలేజీ, రూ.500 కోట్లతో మందమర్రి దగ్గర ఏర్పాటు చేయనున్న ఆయిల్‌ పాం ఫ్యాక్టరీ నిర్మాణ పనులకు, గోదావరిపై రూ.164 కోట్లతో నిర్మించే మంచిర్యాల అంతర్గాం బ్రిడ్జికి కేసీఆర్‌ శంకుస్థాపన చేశారు.

మంచిర్యాల జిల్లా క‌లెక్ట‌రేట్ ఓపెనింగ్ అనంత‌రం కేసీఆర్ ఉద్యోగులను ఉద్దేశించి ప్ర‌సంగించారు. గత 9 ఏళ్ల తెలంగాణ చరిత్రలో ఒకటి రెండు దెబ్బలు తిన్నామని, కరోనా, నోట్ల రద్దు వంటివి కోలుకోలేని దెబ్బలు తీశాయని సీఎం కేసీఆర్ అన్నారు. ఇప్పుడు కనిపిస్తున్న ప్రగతి అనేది గతంలో చేసిన కృషి అని అన్నారు. ఈ ప్రగతిలో భాగస్వాములు అయిన ప్రతి ఒక్క ప్రభుత్వ అధికారికి ధన్యవాదాలు తెలిపారు. మ‌నంద‌రం చేసిన పోరాటంతో తెలంగాణ సాధించుకున్నాం. ప‌రిపాల‌న సంస్క‌ర‌ణ‌ల కోసం నూత‌న క‌లెక్ట‌రేట్‌ల‌ను నిర్మించుకున్నాం. సంస్క‌ర‌ణ అనేది నిరంతర ప్ర‌క్రియ‌. మంచిర్యాల జిల్లా డిమాండ్ ఎప్ప‌ట్నుంచో ఉంది. తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది కాబ‌ట్టే మంచిర్యాల‌ను జిల్లాగా ఏర్పాటు చేసుకున్నాం. ప్ర‌జ‌ల‌కు మంచి జ‌ర‌గాల‌నే కొత్త జిల్లాలు ఏర్పాటు చేసుకున్నాం. ఆసిఫాబాద్ క‌లెక్ట‌రేట్‌ను కూడా త్వ‌ర‌లోనే ప్రారంభించుకోబోతున్నాం. వ‌రి ధాన్యం ఉత్ప‌త్తిలో తెలంగాణ టాప్‌లో ఉంద‌న్నారు. ప్ర‌జ‌ల‌కు వార‌ధిగా ఉద్యోగులు ప‌ని చేయ‌డంతో, మంచి ఫ‌లితాల‌ను సాధించాం. తెలంగాణ ఎన్నో విష‌యాల్లో నంబ‌ర్ వ‌న్‌గా ఉంది. అనేక రికార్డుల‌ను నెల‌కొల్పాం. క‌రోనా, నోట్ల ర‌ద్దు ప్ర‌జ‌ల జీవితాల‌ను అత‌లాకుత‌లం చేశాయి. క‌ష్ట‌కాలంలోనూ తెలంగాణ అభివృద్ధిలో ముందుంది. కుల‌మ‌తాల‌కు అతీతంగా అంద‌రి సంక్షేమానికి కృషి చేస్తున్నాం. అభివృద్ధి, సంక్షేమ ఫ‌లాల‌ను ప్ర‌జ‌ల‌కు చేర‌వేస్తున్న అధికారుల‌కు అభినంద‌న‌లు. కుల‌వృత్తుల‌కు ఆర్థిక సాయం ప‌థ‌కాన్ని, రెండో విడుత గొర్రెల పంపిణీ ప‌థ‌కాన్ని మంచిర్యాల నుంచే ప్రారంభించుకోబోతున్నాం. గొర్రెల పెంప‌కంలో తెలంగాణ మొద‌టి స్థానంలో ఉంది. మాన‌వీయ కోణంలో సంక్షేమ ప‌థ‌కాల‌ను అమ‌లు చేస్తున్నాం. ఆరోగ్య శాఖ బ్ర‌హ్మాండ‌మైన పురోగ‌తి సాధించింది. మాతాశిశు మ‌ర‌ణాలు త‌గ్గాయి. కంటి వెలుగు లాంటి ప‌థ‌కం దేశంలో ఎక్క‌డా లేదు. కంటి వెలుగు కార్య‌క్ర‌మాన్ని ఢిల్లీ, పంజాబ్‌లో కూడా ఆ ముఖ్య‌మంత్రులు కూడా అమ‌లు చేశార‌ని సీఎం కేసీఆర్ తెలిపారు.

- Advertisement -

తెలంగాణ నేడు అనేక విషయాల్లో నెంబర్ 1గా ఉందని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. తలసరి ఆదాయం, తాగునీరు, ఆహార ఉత్పత్తి తదితర అన్ని విషయాల్లో మొదటి స్థానంలో నిలిచామని అన్నారు. ప‌సికూన అయిన 10 సంవ‌త్స‌రాల తెలంగాణ‌.. మిగ‌తా రాష్ట్రాల‌తో పోటీ ప‌డుతోందని కేసీఆర్ పేర్కొన్నారు. అన్ని రంగాల్లో ముందంజ‌లో ఉన్న తెలంగాణ‌.. కేంద్రం నుంచి అనేక అవార్డుల‌ను అందుకుంద‌ని కేసీఆర్ తెలిపారు. రెండో విడత గొర్రెల పంపిణీని మంచిర్యాల నుంచే ప్రారంభించుకోబోతున్నామని అన్నారు. చిన్నచిన్న వ్యాపారాలు చేసుకొనే బీసీలను ఆదుకుంటామని చెప్పారు. నాయి బ్రాహ్మణులకు రూ.లక్ష, రజకులకు, ఇతర చేతిపనుల వారిని ఆదుకొనేందుకు ఆర్థిక సాయం చేస్తామని చెప్పారు. యాదవులు అధికంగా ఉన్న తెలంగాణలో గొర్రెలను దిగుమతి చేసుకోవడం ఏంటని, తానే ఉత్పత్తి పెంచాలని గొర్రెల పంపిణీకి శ్రీకారం చుట్టామని అన్నారు. ఈ విషయంలో కూడా దేశంలోనే మొదటి స్థానంలో ఉంటామని అన్నారు.

‘‘ఆసిఫాబాద్ క‌లెక్ట‌రేట్‌ను కూడా త్వ‌ర‌లోనే ప్రారంభించుకోబోతున్నాం. ప్ర‌జ‌ల‌కు వార‌ధిగా ఉద్యోగులు ప‌ని చేయ‌డంతో, మంచి ఫ‌లితాల‌ను సాధించాం. మాన‌వీయ కోణంలో సంక్షేమ ప‌థ‌కాల‌ను అమ‌లు చేస్తున్నాం. ఆరోగ్య శాఖ బ్ర‌హ్మాండ‌మైన పురోగ‌తి సాధించింది. మాతాశిశు మ‌ర‌ణాలు త‌గ్గాయి. కంటి వెలుగు లాంటి ప‌థ‌కం దేశంలో ఎక్క‌డా లేదు. కంటి వెలుగు కార్య‌క్ర‌మాన్ని ఢిల్లీ, పంజాబ్‌లో కూడా ఆ ముఖ్య‌మంత్రులు కూడా అమ‌లు చేశార‌ు’’ అని సీఎం కేసీఆర్ తెలిపారు. మంచిర్యాల జిల్లా డిమాండ్ ఎప్ప‌టి నుంచో ఉందని, తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది కాబ‌ట్టే మంచిర్యాల‌ను జిల్లాగా ఏర్పాటు చేసుకున్నామని కేసీఆర్ అన్నారు. ప్ర‌జ‌ల‌కు మంచి జ‌ర‌గాల‌నే కొత్త జిల్లాలు ఏర్పాటు చేసుకున్నామని అన్నారు. కలెక్టరేట్‌ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, మంత్రులు ప్రశాంత్‌ రెడ్డి, ఇంద్రకరణ్‌ రెడ్డి, గంగుల కమలాకర్‌, ఎంపీ వెంకటేశ్‌ నేత, ఎమ్మెల్యేలు బాల్క సుమన్‌, దివాకర్‌ రావు, దుర్గం చిన్నయ్య, జోగు రామన్న, రేఖా నాయక్‌తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. అలాగే మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన బీఆర్‌ఎస్‌ పార్టీ ఆఫీసును ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రారంభించారు. ఆఫీసు ప్రారంభోత్సవానికి ముందు ఆ ఆవరణలో ఏర్పాటు చేసిన పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం శిలాఫలకాన్ని ఆవిష్కరించి, రిబ్బన్‌ కట్‌ చేసి, కార్యాలయంలోకి సీఎం కేసీఆర్‌ ప్రవేశించారు. ఈ పార్టీ కార్యాలయాన్ని రూ. 60 లక్షలతో నిర్మించారు. పార్టీ ఆఫీసు వద్దకు చేరుకున్న కేసీఆర్‌కు మంచిర్యాల జిల్లా టీఆర్‌ఎస్‌ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికారు. కార్యక్రమంలో మంత్రులు ఇంద్రకరణ్‌ రెడ్డి, ప్రశాంత్‌ రెడ్డి, ఎంపీ వెంకటేశ్‌ నేత, ఎమ్మెల్యే బాల్క సుమన్‌, దుర్గం చిన్నయ్య, దివాకర్‌ రావు, జోగు రామన్న, రేఖా నాయక్‌తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు