- వివాహమైన నాలుగు నెలలకే భార్యపై అనుమానం
- ఈ తెల్లవారుజామున హత్యచేసి బైక్పై పోలీస్ స్టేషన్కు
- ఆగివున్న లారీని ఢీకొట్టి అక్కడికక్కడే మృతి
ఆదిలాబాద్ : వివాహమై నాలుగు నెలలు కూడా కాకుండానే భార్యపై అనుమానం పెంచుకున్న భర్త ఆమెను దారుణంగా హత్య చేసి ఆపై పోలీసులకు లొంగిపోయేందుకు వెళ్తూ రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఆదిలాబాద్లో జరిగిందీ ఘటన. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. భరత్ అరుణ్ అనే యువకుడికి బాల్కొండకు చెందిన దీప్తి అనే అమ్మాయితో నాలుగు నెలల క క్రితమే వివాహమైంది. ఏమైందో తెలీదు గానీ.. గత కొద్ది రోజులుగా దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. శుక్రవారం కూడా వీరిద్దరి మధ్య గొడవ జరగ్గా కోపం పట్టలేకపోయిన అరుణ్ భార్యను హత్య చేశాడు. అనంతరం బైక్ మీద పారిపోతుండగా.. రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని ఢీకొట్టాడు. దీంతో అతడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. తలకు తీవ్ర గాయం కావడంతో అతడు ఘటనా స్థలంలోనే కన్నమూశాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. క్షణికావేశంలో భార్యను చంపిన భర్త.. కాసేపటికే రోడ్డు ప్రమాదంలో ప్రాణాలను కోల్పోవడంతో స్థానికంగా విషాదం అలుముకుంది. భార్యను చంపి.. తప్పించుకొని పారిపోయే ప్రయత్నంలో.. టెన్షన్కు లోనైన భరత్.. లారీని ఢీకొట్టి ప్రాణాలు కోల్పోయాడు.