Sunday, May 5, 2024

భారీ డిస్కౌంట్లో బంగారం..

తప్పక చదవండి

ప్రస్తుతం బంగారం రేట్లు ఏ విధంగా పెరుగుతున్నాయో తెలిసిందే. అయితే మీరు ఇన్వెస్ట్‌మెంట్ కోసం తక్కువ ధరకే బంగారం కొనుగోలు చేయవచ్చు. కేంద్ర ప్రభుత్వమే ఈ విక్రయాలు చేపడుతోంది. ఆన్‌లైన్ ద్వారా కొనుగోలు చేసిన వారికి అదనపు బెనిఫిట్ ఉంటుంది. ఇంతకీ ఈ సావరిన్ గోల్డ్ బాండ్స్ ఏమిటి? సేల్ ఎప్పటి నుంచి మొదలవుతుంది? అనేది తెలుసుకుందాం.
మన దేశంలో బంగారాన్ని ఆభరణాల రూపంలో ధరిస్తారు. ఇటీవలి కాలంలో బంగారంపై పెట్టుబడులు సైతం భారీగానే పెరిగాయి. దీంతో ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. తులం బంగారం కొనాలంటేనే రూ.70 వేల పైన పలుకుతోంది. దీంతో చాలా మంది వెనకడుగు వేస్తుంటారు. అయితే, అలాంటి వారికి మంచి అవకాశంగా చెప్పవచ్చు. ప్రస్తుతం భారీ తగ్గింపుతో బంగారం కొనుగోలు చేయొచ్చు. పసిడి పై ఇన్వెస్ట్ చేయాలనుకునే వారికి కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఒక ఆకర్షణీయమైన స్కీమ్ అందుబాటులో ఉంది. అదే సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్-2023-24 సిరీస్ 2. కేంద్రం తరపున వీటిని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విక్రయిస్తుంది. ఈ సావరిన్ గోల్డ్ బాండ్లలో ఇన్వెస్ట్ చేసేందుకు ఈ ఏడాది మరోసారి అవకాశం ఇస్తోంది రిజర్వ్ బ్యాంక్.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సావెరిన్ గోల్డ్ బాండ్స్ సెప్టెంబర్ 2023కి సంబంధించిన ధరలను శుక్రవారం ప్రకటించింది. ఒక గ్రాముకు రూ. 5, 923గా నిర్ణయించింది. ఈ గోల్డ్ బాండ్ల విక్రయాలు సెప్టెంబర్ 11, 2023న అంటే వచ్చే సోమవారం ప్రారంభం కానున్నాయి. ఇవి సెప్టెంబర్ 15, 2023 వరకు అంటే వచ్చే శుక్రవారం వరకు అందుబాటులో ఉంటాయి. ఈ మేరకు శుక్రవారం ప్రెస్ స్టేట్మెంట్ విడుదల చేసింది ఆర్‌బీఐ. గత మూడు వర్కింగ్ డేస్‌లోని సగటు ధరను పరిగణనలోకి తీసుకుని రిజర్వ బ్యాంక్ ఈ రేటు నిర్ణయిస్తుంది. అంటే ఈసారి సెప్టెంబర్ 6, సెప్టెంబర్ 7, సెప్టెంబర్ 8, 2023 రోజుల్లో ఇండియన్ బులియన్ అండ్ జువెలరీ అసోసియేషన్ లిమిటెడ్ 999 ప్యూరిటీ గోల్డ్ రేట్లను ప్రకటించగా వాటిని ఆధారంగా చేసుకుని రెట్ ఫిక్స్ చేసింది.
ఆన్‌లైన్ ద్వారా కొనుగోలు చేసి ఆన్‌లైన్ ద్వారానే చెల్లింపులు జరిపిన వారికి ఒక గ్రాము బంగారంపై రూ. 50 మేర డిస్కౌంట్ లభిస్తుంది. ఈ మేరకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సంప్రదింపుల తర్వాత కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. అలాంటి ఇన్వెస్టర్లకు సావెరిన్ గోల్డ్ బాండ్ అనేది గ్రాముకు రూ. 5,873కే లభిస్తుంది. మరోవైపు.. సావెరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్ 2023-24 సిరీస్ 2 అనేది బ్యాంకులు, స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, గుర్తింపు పొందిన పోస్టాఫీసులు, గుర్తింపు పొందిన స్టాక్ ఎక్స్చేంజీల ద్వారా ఈ బాండ్ల విక్రయాలు చేపడతారు.
ఈ సావెరిన్ గోల్డ్ బాండ్ల కొనుగోలులో హెచ్‌యూఎఫ్స్, ట్రస్టులు, యూనివర్సిటీలు, ఛారిటబుల్ ఇన్సిస్ట్యూషన్స్ కు పరిమితులు ఉంటాయి. ఈ గోల్డ్ బాండ్ల టెన్యూర్ అనేది 8 ఏళ్లుగా ఉంటుంది. అయితే, 5 ఏళ్ల తర్వాత ప్రీమెచ్యూర్ రిడంప్షన్ చేసుకునేందుకు అవకాశం కల్పించారు. ఒక వ్యక్తి కనీసం ఒక గ్రాము నుంచి గరిష్ఠంగా 4 కేజీల వరకు గోల్డ్ కొనుగోలు చేయవచ్చు. అయితే, ట్రస్టులకు 20 కిలోలు కొనుగోలు చేయవచ్చు. ఈ గోల్డ్ బాండ్లపై వార్షిక వడ్డీ రేటు 2.50 శాతంగా ఉంటుంది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు