- తృటిలో తప్పిన పెను ప్రమాదం..
మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిథిలో ఘోర ప్రమాదం తప్పింది.. సాయినగర్ ప్రాంతంలో ఉన్న ఒక హోటల్ లో ఒకదాని తరువాత ఒకటి రెండు సిలిండర్లు పెద్ద శబ్దంతో పేలిపోయాయి.. ఆ సమయంలో హోటల్ లో ఉన్న కస్టమర్లు, కార్మికులు భయంతో బయటకు పరుగులు తీశారు.. విషయం తెలిసిన పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకుని వచ్చారు.. ప్రమాదం ఎలా సంభవించింది అనే విషయం మీద పోలీసులు ఆరా తీస్తున్నారు..
తప్పక చదవండి
-Advertisement-