Thursday, May 9, 2024

ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన కారు..

తప్పక చదవండి

ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. జిల్లాలోని నల్లజర్ల మండలం అనంతపల్లి సమీపంలో జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని ఓ కారు ఢీకొట్టింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న ఆరుగురు అక్కడికక్కడే మరణించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని దవాఖానకు తరలించారు. మృతుల్లో ముగ్గురు మహిళలు, ఓ చిన్నారి ఉన్నదని చెప్పారు. కారు రాజమండ్రి నుంచి విజయవాడ వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందన్నారు. ప్రమాద ధాటికి కారు నుజ్జునుజ్జు అయిందని చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉన్నది.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు