Monday, May 13, 2024

గ్రూప్-2 పరీక్షపై సర్వత్రా ఉత్కంఠ..

తప్పక చదవండి
  • ఈనెల 14వ తేదీన నిర్ణయం తీసుకోనున్న టీఎస్పీఎస్సీ..
  • గ్రూప్ – 2 పరీక్షకు అన్ని ఏర్పాట్లు చేశామన్న టి.ఎస్.పీ.ఎస్.సి. న్యాయవాది..
  • అభ్యర్థుల్లో నెలకొన్న అయోమయం..
    హైదరాబాద్ : గ్రూప్ – 2 పరీక్ష వాయిదాపై హైకోర్టులో వాదనలు ముగిశాయి. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. పరీక్షల నిర్వహణపై ఏ నిర్ణయం తీసుకుంటారో సోమవారంలోపు చెప్పాలని టీఎస్ పీఎస్ సీకి ఆదేశించింది. ఒకే నెలలో హడావుడిగా పరీక్ష నిర్వహిస్తున్నారని అభ్యర్థుల తరుపు అడ్వకేట్ వాదనలు వినిపించారు. కాగా.. పరీక్ష వాయిదాపై ఆగస్టు 14న నిర్ణయం తీసుకుంటామని టీఎస్‌పీఎస్సీ పేర్కొంది. అయితే.. ఇప్పటికే పరీక్ష నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేసినట్టు ధర్మాసనానికి టీఎస్పీఎస్సీ వివరించింది. మరోవైపు.. ఆగస్టులో గ్రూప్-2 సహా వేర్వేరు సిలబస్‌తో కూడిన 21 పోటీ పరీక్షలు ఉన్నాయంటూ పిటిషనర్ల తరఫు న్యాయవాదులు న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు. గ్రూప్-1, గ్రూప్-2 పరీక్షలు చాలా ముఖ్యమైనవని… గ్రూప్-2 పరీక్ష వాయిదా వేయాలని జూన్‌లోనే వినతిపత్రం ఇచ్చినట్టు గుర్తుచేశారు. అయితే.. టీఎస్‌పీఎస్సీ మాత్రం దీనిపై స్పందించలేదని చెప్పుకొచ్చారు. కాగా గ్రూప్-2 పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు టీఎస్‌పీఎస్సీ తరఫు న్యాయవాది ధర్నాసనానికి తెలిపారు. తెలంగాణ వ్యాప్తంగా 1,535 పరీక్ష కేంద్రాలను రెడీ చేశామని.. పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయనున్న విద్యాసంస్థలకు ప్రభుత్వం సెలవులు కూడా ప్రకటించిందని తెలిపారు. కాగా.. గ్రూప్‌-2కి ఐదున్నర లక్షల మంది దరఖాస్తు చేసుకుంటే.. అందులో గురుకుల పరీక్షలు రాస్తుంది కేవలం 60 వేల మందేనని పేర్కొన్నారు. ఇరువైపులా వాదనలు విన్న ధర్మాసనం.. గురుకుల పరీక్షలు రాస్తుంది కొంత మందే అయినా వారికి కూడా అవకాశం ఉండాలని వ్యాఖ్యానించింది. లక్షల మంది దరఖాస్తుదారుల్లో పిటిషన్ వేసింది 150 మంది మాత్రమేనని టీఎస్‌పీఎస్సీ పేర్కొనగా.. దానిపై స్పందిస్తూ కోర్టుకు అందరూ రాలేరని జడ్జి తెలిపారు.
    గ్రూప్‌-2 పరీక్ష వాయిదా వేయాలన్న అభ్యర్థుల విజ్ఞప్తిపై నిర్ణయాన్ని ఈ నెల 16వ తేదీ లోపు చెబుతామని టీఎస్పీఎస్సీ తరఫు న్యాయవాది ధర్మాసనానికి తెలపగా.. ఈ అంశంపై చాలా మంది ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారని.. 14 తేదీనే తమ నిర్ణయం వెల్లడించాలని ధర్మాసనం ఆదేశించింది. ఇదిలా ఉంటే.. పరీక్ష వాయిదా పడుతుందా లేదా అన్న అయోమయంలో పడిపోయారు అభ్యర్థులు. ఏ పరీక్షకు ప్రిపేర్ అయ్యేందుకు పూర్తి సమయం కేటాయించాలన్న క్లారిటీ లేకపోవటంతో.. దేనిపైనా కన్‌సన్‌ట్రేషన్ చేయలేకపోతున్నారు. అయితే.. వాయిదా పడుతుందని తెలిస్తే మిగతావాటికి ప్రిపేర్ అవ్వొచ్చని.. లేకపోతే తాము ఫోకస్ చేసిన దానిపైనే పూర్తి సమయం పెట్టొచ్చు కదా అన్న భావనలో ఉన్నట్టు తెలుస్తోంది
-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు