- కార్యక్రమం నిర్వహించిన జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సిహెచ్ శివలింగయ్య..
జనగామ : శనివారం నాడు, జిల్లా కలెక్టరేట్ కార్యాలయ ప్రాంగణంలోని ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ గోడౌన్ అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) సుహాసిని, రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి ప్రతి మూడు నెలలకు ఒకసారి జరిగే (త్రైమాసిక తనిఖీ) నిర్వహించారు..
![](https://www.aadabhyderabad.in/wp-content/uploads/2023/10/electronic-voting-machine-evm-godown-quarterly-inspection-2.jpg)
ఈ సందర్భంగా ఆయన (ఈవీఎం) గోడౌన్ పరిసరాలను సీసీ కెమెరాలు, విద్యుత్, భద్రత, ఫైర్ సెక్యూరిటీ తదితర అంశాలను పరిశీలించి సిబ్బందికి తగు సూచనలు జారీ చేశారు.. ఈ తనిఖీల్లో జనగామ ఈఆర్ఓ మురళీకృష్ణ, తహసిల్దార్ మహిపాల్ రెడ్డి, రాజకీయ పార్టీ ప్రతినిధులు బిఆర్ఎస్ రావేల రవి, కాంగ్రెస్ యు.రవి, బిజెపి విజయ్ భాస్కర్, సిపిఐ సోమయ్య, బి.ఎస్.పి జె .కుమార్, ఎన్నికల విభాగం తాహసిల్దార్స్ యతేషాం అలీ, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు..