Sunday, May 19, 2024

ధరణి పెండిరగ్‌ దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలి

తప్పక చదవండి
  • జిల్లా కలెక్టర్లకు, రెవెన్యూ అధికారులకు రెవెన్యూ శాఖ
  • ముఖ్య కార్యదర్శి నవీన్‌ మిట్టల్‌ ఆదేశాలు

వికారాబాద్‌ జిల్లా : ధరణి పెండిరగ్‌ దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్‌ మిట్టల్‌ అన్నారు. శుక్రవారం జిల్లా కలెక్టర్లు, రెవెన్యూ అధికారులు, తహసిల్దార్లతో హైదరాబాద్‌ నుండి వీడియో సమావేశం నిర్వహించి జీఓ 58, 59, 76, 118 కింద భూ క్రమబద్దికరణ, ధరణి పెండిరగ్‌ దరఖాస్తులు, ధరణిలో నూతన ఆప్షన్‌ పై సమీక్షించారు. ఈ సందర్భంగా రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్‌ మిట్టల్‌ మాట్లాడుతూ జీఓ 59 కింద గతంలో వచ్చిన దరఖాస్తులలో 10 లక్షల కంటే అధికంగా చెల్లించాల్సిన 1458 దరఖాస్తుదారులు ఇప్పటి వరకు చెల్లింపులు ప్రారంభించలేదని, వెంటనే వారికి నోటీసులు జారీ చేసి చెల్లింపుచేసేలా చూడాలని సూచించారు. జీఓ 59 కింద లక్ష లోపు చెల్లించాల్సిన 3689 దరఖాస్తుదారులకు సైతం నోటీసు అందించి త్వరితగతిన చెల్లింపు చేసేలా అవగాహన కల్పించాలని ఆయన తెలిపారు. ప్రభుత్వం చాలా తక్కువ ధరకు భూ క్రమబద్ధీకరణ చేస్తున్నప్పటికీ అలసత్వం వహించడం సరికాదని, లబ్ధిదారులు ముందుకు వచ్చి చెల్లింపులు ప్రారంభించాలని ఆయన పేర్కొన్నారు. జీఓ 58 కింద గతంలో 20 వేల 668 మంది లబ్ధిదారులకు పట్టాలను ఉచితంగా పంపిణీ చేసేందుకు సిద్ధం చేశామని, వాటిలో 561 పట్టాల పంపిణీ ఇంకా పెండిరగ్‌ ఉందని దీనిని 2 రోజుల్లో పూర్తి చేయాలని ఆయన సంబంధిత కలెక్టర్‌ లకు సూచించారు.జీఓ 58 కింద 1,20,357 జీఓ 59 కింద 57,661, జిఓ 76 కింద 11, 810 దరఖాస్తులు వచ్చాయని, వీటిని క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టేందుకు బృందాలను ఏర్పాటు చేసి నెలరోజుల వ్యవధిలో క్షేత్రస్థాయి విచారణ ద్వారా అర్హులను ఎంపిక చేయాలని ఆయన సూచించారు. జీఓ 118 కింద పెండిరగ్‌ ఉన్న దరఖాస్తులు 15 రోజుల పూర్తి చేయాలని అన్నారు. ధరణి కింద పెండిరగ్‌ ఉన్న దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్‌ లకు ఆయన సూచించారు.
భూ సమస్యల పరిష్కారానికి 5 మాడ్యుయేషన్లను అందుబాటులోకి తెచ్చాం: నవీన్‌ మిట్టల్‌భూ సమస్యల పరిష్కారం కోసం ధరణిలో కొత్తగా ఐదు మాడ్యుయేషన్లను అందుబాటులోకి తెచ్చామని, ధరణి సేవలను విస్తృతం చేయడంతో పాటు చిన్న చిన్న లోపాలను సవరించడం జరుగుతుందని తెలిపారు. ధరణిలో చేరిన నకిలీ సర్వే నెంబర్లు, డబుల్‌ సర్వే నెంబర్లు పరిష్కరించేందుకు మాడ్యుల్‌ తహసిల్దార్‌ లాగిన్‌ లో జత చేశామని, కంపెనీలకు మంజూరు చేసిన పట్టాదారు పాసుపుస్తకాలలో తప్పులుంటే సవరించే అధికారాన్ని కలెక్టర్‌ లాగిన్‌ లో అందించామని, ఆధార్‌ సీడిరగ్‌ సమయంలో పొరపాటు వల్ల ఒకరి భూమి మరో వ్యక్తికి అనుసంధానమైందని, దీని నివారణకు తహసిల్దార్‌ లాగిన్‌ లో అవకాశం కల్పించామని తెలిపారు.ఆర్‌.ఎస్‌.ఆర్‌ ప్యురిఫికేషన్‌ కోసం ముందస్తుగా 5 ఎకరాల పైబి ఉన్న 12,546 కేసులను మండలాల వారిగా గుర్తించి సమస్య పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. మిస్సింగ్‌ సర్వే నెంబర్లు, విస్తీర్ణ సవరణ దరఖాస్తులలో ఆర్‌.ఎస్‌.ఆర్‌ విస్తిర్ణం, ప్రస్తుతం ఉన్న సర్వే నెంబర్‌ లు పరిశీలించి పరిష్కరించాలని ఆయన తెలిపారు.ఈ వీడియో కాన్ఫరెన్స్‌ లో జిల్లా కలెక్టర్‌ సి.నారాయణ రెడ్డి ,జిల్లా అదనపు కలెక్టర్‌ (రెవెన్యూ) లింగ్యా నాయక్‌, సెక్షన్‌ సూపరింటెండెంట్‌ హరిత తదితరులు పాల్గొన్నారు.

-Advertisement-
- Advertisement -
తాజా వార్తలు
- Advertisement -

మరిన్ని వార్తలు